గందరగోళం, సభ వాయిదా: రోడ్లు ఊడ్చిన బిజెపి సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తీవ్ర గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా పడింది. గురువారం శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు తమ తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు.
అయితే, ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యనే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యురాలు కొండా సురేఖ అంగన్వాడీ సమస్యలపై ప్రశ్నలు వేశారు. ఆమె వేసిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమాధానం ఇచ్చారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

ఈ స్థితిలో స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారం పది గంటలకు వాయిదా వేశారు. రుణమాఫీ గురించి తాము ప్రస్తావిస్తే సభ నుంచి ప్రభుత్వం పారిపోయిందని బిజెపి సభ్యుడు ప్రభాకర్ అన్నారు.
ఇదిలావుంటే, జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. జీతాలు పెంచాలని అడిగిన కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేయడం ఎంత వరకు న్యాయమని బీజేపీ నేతలు ప్రశ్నించారు. తొలగించిన జీహెచ్ఎంసీ కార్మికులను వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications