వివాహేతర సంబంధమే కారణమా?: తల్లిని పొడిచి చంపారు
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్పల్లి సంజీవ్నగర్లో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమారుడే తన పిన్నిని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా.. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే కుటుంబం పరువు తీస్తోందనే నెపంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి సంజీవయ్యనగర్కాలనీకి చెందిన జ్యోతి(40) ఎదురింట్లో ఉంటున్న రాజేందర్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవలే ఇరువురు అత్యంత సన్నిహితంగా ఉండటం జ్యోతి కుమారుడు రాహుల్ చూడటంతో గత మూడు రోజులుగా జ్యోతికి ఆమె కుటుంబసభ్యులకు మధ్య గొడువలు జరుగుతున్నాయి.
ఈ అంశాన్ని జీర్జించుకోలేని జ్యోతి బావ కుమారుడు గణేష్ గురువారం ఉదయం 10 గంటల సమయంలో పిన్ని ఒంటరిగా ఉండటం చూసి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా, స్థానికులు జ్యోతిని చికిత్స నిమిత్తం 108 ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications