హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధమే కారణమా?: తల్లిని పొడిచి చంపారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి సంజీవ్‌నగర్‌లో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమారుడే తన పిన్నిని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా.. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే కుటుంబం పరువు తీస్తోందనే నెపంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.

murder

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి సంజీవయ్యనగర్‌కాలనీకి చెందిన జ్యోతి(40) ఎదురింట్లో ఉంటున్న రాజేందర్‌ అనే వ్యక్తితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవలే ఇరువురు అత్యంత సన్నిహితంగా ఉండటం జ్యోతి కుమారుడు రాహుల్‌ చూడటంతో గత మూడు రోజులుగా జ్యోతికి ఆమె కుటుంబసభ్యులకు మధ్య గొడువలు జరుగుతున్నాయి.

ఈ అంశాన్ని జీర్జించుకోలేని జ్యోతి బావ కుమారుడు గణేష్‌ గురువారం ఉదయం 10 గంటల సమయంలో పిన్ని ఒంటరిగా ఉండటం చూసి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా, స్థానికులు జ్యోతిని చికిత్స నిమిత్తం 108 ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది.

English summary
Two sons were murdered their mother in Secunderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X