ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్: రూట్ ఇదే- పట్టాలెక్కేది అప్పుడే
Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో అవి రూపుదిద్దుకుంటోన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.
ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. కిందటి నెల 12వ తేదీన 10 వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భువనేశ్వర్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ కూడా ఉంది.
ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇది. విశాఖపట్నం నుంచి పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య ఈ కొత్త ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. విశాఖపట్నం- దుర్గ్ రూట్ను ఖరారు చేశారు. ఈ మార్గంలో ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో లేదు.
విశాఖపట్నంలో బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతిపురం, రాయగడ, ఖండేల్ రోడ్, టిట్లాగఢ్ జంక్షన్, మహాసముంద్, రాయ్పూర్ జంక్షన్, భిలాయ్ మీదుగా దుర్గ్కు చేరుతుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 566 కిలోమీటర్లు. రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది.
వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. 6 నుంచి 7 గంటల్లోగా గమ్యాస్థానాలకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ తరువాత ఈ రైలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications