వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో అరకిలో బంగారం గెలిచిన చిన్నారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gold
దుబాయ్‌: షాపింగ్‌ ఉత్సవంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం డ్రాలో భాగంగా భారత్‌కు చెందిన నాలుగేళ్ల బాలిక అరకిలో బంగారం గెలుపొందింది. దుబాయ్‌ షాపింగ్‌ ఉత్సవంలో ప్రస్తుతం కొనసాగుతున్న లక్కీ బ్యాగ్ డ్రాలో జేస్‌ ఎల్మా మాథ్యూ ఈ అదృష్టం దక్కింది. అమ్మాయి తండ్రి సాజు మాథ్యూ బంగారు నగలను కొనుగోలు చేసినందుకు ఇచ్చిన కూపన్లపై తన కుమార్తె పేరు రాశారు. దుబాయ్‌ షాపింగ్‌ ఉత్సవంలో బంగారం గెలుపొందడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జేస్‌ అయితే మరీ సంతోషంగా ఉంది అని సాజు చెప్పారు.

ఈ బంగారాన్ని జేస్‌ పెళ్లికోసం దాచాలని ఆమె తల్లి ఎల్మా భావిస్తున్నారు. కాగా వచ్చేనెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవంలో దుబాయ్‌ బంగారం, నగల గ్రూప్‌ తన ఖాతాదారులకు 21 కిలోల బంగారం గెలుపొందే అవకాశం కల్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X