మొయిలీపై ఎన్నారైల ఆగ్రహం

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రుల పక్షం తీసుకుని ప్రజాస్వామ్య పవిత్ర స్థలమైన పార్లమెంటులో రాజ్యాంగం గురించి తెలియకుండా మొయిలీ ఆ విధంగా మాట్లాడి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 294 మంది సభ్యుల శాసనసభలో 175 అంటే 60 శాతం మంది శాసనసభ్యులు సీమాంధ్రకే చెందినవారైనప్పుడు శాసనసభలో తీర్మానం ఆమోదం పొందడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. పార్లమెంటులో మెజారిటీ ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను రాష్ట్రస్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నిరాధారమైన ప్రకటన చేసినందుకు మొయిలీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిఎఫ్ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications