అమెరికాలో స్నిగ్ధ సువర్ణ భరతనాట్యం

స్నిగ్ధ తల్లిదండ్రులు మాధవి సువర్ణ, శ్రీధర్ సువర్ణ కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవారు. గత 14 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నారు. స్నిగ్ధ తన 7వ యేట గురు మీనాక్షి గణేషన్ మార్గదర్శకత్వంలో కళాంజలి డ్యాన్స్ స్కూల్ ద్వారా భరతనాట్యం విద్యార్థినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గత ఏడేళ్లుగా ఆమె భరత నాట్యాన్ని ఏకదీక్షతో అభ్యసిస్తోంది. 2007లో తొలిసారి వేదిక మీద ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంది.
గంట పాటు స్నిగ్ధ ఇచ్చిన ప్రదర్శనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూశారు. అమెరికన్లు, భారతీయులు ఆమె ప్రదర్శనను తిలకించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రధాన కార్యదర్సి మురళీ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నిగ్ధను ఆయన ఉత్తర అమెరికా నాట్య మయూరిగా అభివర్ణించారు.
స్నిగ్ధ గతంలో లెమెంటో దేవాలయం మిడ్వెస్ట్ డ్యాన్స్ ఫెస్టివల్, ఐల్, క్లీవ్ల్యాండ్ త్యాగరాజ ఆరాధన వంటి కార్యక్రమాల్లో నృత్యపోటీల్లో పాల్గొంది. విస్కాన్సిన్ చుట్టుపక్కల కళాంజలి డ్యాన్స్ స్కూల్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications