NRI News: ఎన్నారై మహిళ వద్ద రూ.10 లక్షల విలువైన బంగారం చోరీ..
DLF ఫేజ్-IIIలో ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మహిళ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రూ.10 విలువైన ఆభరణాలను దోచుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 26న ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్లో స్థిరపడిన శశిబాలా అనే మహిళ గురుగ్రామ్ వచ్చారు. తన ఆభరణాలు చోరీ కావడంతో బాధితురాలు నవంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నవంబర్ 26 సెక్టార్-4 ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు బాలా బ్యాంకాక్ నుండి DLF ఫేజ్-IIIలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆమె ఢిల్లీకి వెళ్లాలని భావించి ఆటోలో సికిందర్పూర్ మెట్రో స్టేషన్కు చేరుకుంది. ఆమె తన సోదరి నివాసం నుంచి 400 మీటర్ల దూరం వెళ్లగానే మోటారుసైకిల్పై ఇద్దరు అనుమానితులు ఆమెను అడ్డగించారని వారు తెలిపారు.

నిందితులిద్దరూ సదరు మహిళకు, ఆటో డ్రైవర్కు నకిలీ గుర్తింపు కార్డులను చూపించారు. అనుమానితుల్లో ఒకరు డ్రైవర్ను తీసుకెళ్లి లైసెన్స్, రిజిస్ట్రేషన్, వాహన బీమా పత్రాలను అడిగారు. మరొకరు బాలాను బ్యాగ్లో ఏముందని ప్రకటించారు. ఆ బ్యాగ్ పట్టుకెళ్లారు. ఆ తర్వాత తేరుకున్న బాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాగులో నాలుగు బంగారు గాజులు, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్, డైమండ్ రింగ్ని ఉందని బాధితురాలు తెలిపింది.
బాలా ఫిర్యాదుపై, మంగళవారం DLF ఫేజ్-III పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 379 (దొంగతనం), 420 (మోసం) కింద అనుమానితులపై ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు. నవంబర్ 27న ఫరీదాబాద్లోని సెక్టార్-16లో, సెక్టార్-15ఏలో ఇలాంటి ఘటనలు మరో రెండు చోటుచేసుకున్నట్లు తమకు తెలిసిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.రెండు ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తమ వద్ద ఉన్నాయని గురుగ్రామ్ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుబాష్ బోకెన్ తెలిపారు.












Click it and Unblock the Notifications