వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యం: సింగపూర్‌లో ట్రక్కు కిందపడి ఎన్నారై మృతి

|
Google Oneindia TeluguNews

Indian man mowed down by truck in Singapore
సింగపూర్: ఉపాధి కోసం సింగపూర్ వెళ్లిన భారతదేశానికి చెందిన వ్యక్తి ట్రక్కు అతని పైనుంచి వెళ్లడతో అక్కడికక్కడే మృతి చెందాడు. కరుప్పచామి కలైమురుగన్(24) సింగపూర్ పశ్చిమంలోని ఛాంగి ప్రాంతంలో శనివారం సాయంత్రం స్టాక్‌పైల్ సైట్‌లో తన విధుల్లో నిమగ్నమై ఉండగా అతడి పైనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కకక్కడే మృతి చెందాడని స్థానిక మీడియా పేర్కొంది.

కాగా, కలైమురుగన్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ట్రక్కు వెనక్కి తీసుకుంటూ అతడిపై నుంచి వెళ్లిపోయిందని మరో మీడియా సంస్థ అయిన సింగపూర్ డెయిలీ తన కథనంలో పేర్కొంది.

ప్రమాదంలో కరుప్పచామి తల మొండెం నుంచి వేరుచేయబడిందని, అది సుమారు ఒక మీటరు దూరంలో విసిరివేయబడిందని మీడియాతో ఆ ట్రక్కు డ్రైవర్ చెప్పారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి కరుప్పచామి మరణానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూచనలు చేస్తున్న సమయంలోనే ఆ ట్రక్కు డ్రైవర్ కరుప్పచామి పైనుంచి వాహనాన్ని నడిపించాడని ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.

English summary
An Indian national was killed after being knocked down by a truck here at a soil stockpile site in eastern Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X