బహ్రెయిన్లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా బహ్రెయిన్లో వేడుకలు చేశారు. బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో "ముక్కోటి వృక్షార్చన" కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ జన్మదినం సందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీలు మగ్గిడి రాజేందర్, పుప్పాల బద్రి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన "ముక్కోటి వృక్షార్చన" గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు.కేటీఆర్ జన్మదినం సందర్బంగా జనహృదయ నేతకు బహరేన్లో మొక్కలు నాటారు. మానవత్వానికి ,సేవకి మారు పేరైన యువ నేత కేటీఆర్ అని ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్ అన్నారు.

టీఅర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications