ప్రవాసీ మిత్ర అవార్డుకు ఎంపికైన యలమర్తి శరత్
హైదరాబాద్: యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ మైగ్రెంట్స్ డే సందర్భంగా డిసెంబర్ 18న ఐదుగురికి ప్రవాసి మిత్ర పురస్కారాలను అందించనున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైగ్రెంట్స్ డేను నిర్వహించి ఈ అవార్డులను అందజేస్తారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా మైగ్రెంట్స్ హక్కుల కోసం పోరాడుతున్న, సహకారం అందిస్తున్నవారికి ఈ అరుదైన గుర్తింపును అందజేయడం జరుగుతోంది. 1990 డిసెంబర్ 18న యూఎన్ జనరల్ అసెంబ్లీ, మైగ్రెంట్ వర్కర్స్, వారి కుటుంబసభ్యుల రక్షణ, హక్కుల కోసం అంతర్జాతీయ స్థాయిలో
వేదికను ఏర్పాటు చేసింది.
యూఏఈ వాసులైన శరత్ యలమర్తిని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ (మెంబర్ ఇన్ మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా) అవార్డుల సెలక్షన్ కమిటీ దుబాయ్.. ప్రవాసి మిత్ర-2015 అవార్డుకు ఎంపిక చేసింది.

వాసవీ యూత్ ఎన్నారై తరుపున అవార్డు గ్రహీతలకు, యలమర్తి శరత్కు జూలూరు సురేష్, రఘురాం సందీప్, జయేష్ బాబు, ప్రదీప్ శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications