హిదాయత్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగం దిగ్భ్రాంతి
కువైట్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్ ఇటీవలే కరోనా బారినపడి మృతి చెందారు. ఈ విషషయం తెలిసిన కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.
ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. గతంలో 2018లో కువైట్లో జరిపిన మినీ మహనాడుకు హిదాయత్ని అహ్వానించామని, వీసా కూడా వచ్చిందని అయితే కొన్ని అనివార్యకారణాల వలన హాజరు కాలేకపొయారని అన్నారు.

హిదాయత్ చాలా నిబద్దతవున్న మైనార్టీ నాయకుడు అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. తెలుగుదేశం కువైట్ కార్యవర్గం తరపున హిదాయత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని కోరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications