NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి..
అమెరికాలో వరుస రోడ్డు ప్రమాదాల్లో భారతీయులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా యూఎస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మరణించాడు. పై చదువుల కోసం ఏపీకి చెందిన ఆచంట రేవంత్ అమెరికా వెళ్లాడు. ఏపీలోని బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) గత సంవత్సరం డిసెంబర్ లో అమెరికా వెళ్లాడు. అక్కడి మాడిసన్ లోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.
రేవంత్ మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమానం) ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రేవంత్ అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

అంతకు ముందు అమెరికాలోని పోర్టుల్యాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో ఉంటున్నారు. వారికి ఆరు సంవత్సరాల కుమార్తె హానిక, మూడేళ్ల కుమారుడు బ్రమణ్ ఉన్నాడు. ఆదివారం గీతాంజలి పుట్టిన రోజు కావడంతో తెల్లవారుజామునే గుడికి వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి కారు ప్రమాదానికి గురైంది. ఘటన్ స్థలిలోనే హానిక మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గీతాంజలి మృత చెందింది. గీతాంజలి, ఆమె కూతురు హానిక మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ప్రమాదంలో గీతాంజలి భర్త నరేష్, కుమారుడు బ్రమణ్ స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications