Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐపీఎల్‌కు ఎదురు కట్నం చదివించుకుంటున్నావేంట్రా?

Digvesh Rathi: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 8వ తేదీన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.

ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ చేతిలో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. రెండో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ చేతిలో చతికిలపడింది. ఇప్పుడు తన సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.

Digvesh Rathi once again fined against Mumbai Indians in IPL 2025

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ టాప్ స్కోరర్. 60 పరుగులతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్- 53, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోనీ- 30, డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ గైర్హాజర్ అయిన గేమ్ ఇది. ఓపెనర్లు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నమన్ ధీర్- 46, సూర్యకుమార్ యాదవ్- 67 మాత్రమే దుమ్ము దులిపారు.

డెత్ ఓవర్లల్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారింది. 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 28 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. నాటౌట్‌గా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్.. ఓటమి అంతర్యాన్ని తగ్గించగలిగిందే గానీ.. ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయింది.

కాగా- ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్ వికెట్‌ను తీసిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠీ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతనిపై భారీ జరిమానా పడంది. వికెట్ తీసిన తరువాత అతన్ని కించపరిచేలా ప్రవర్తించాడు. వికెట్ పడ్డ అనంతరం రైటింగ్ ఇన్ మై నోట్ బుక్ సంకేతాలు ఇచ్చాడు. ఇది అతనిపై జరిమానా పడటానికి కారణమైంది.

అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో మొత్తం 25 శాతం మేర కోత పెట్టింది బీసీసీఐ. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా అవుట్ అయిన తరువాత ఇలాగే- చేత్తో ఏదో రాస్తున్నట్లు ఫోజు ఇచ్చాడు.

నిజానికి- ఐపీఎల్ 2025 మెగా వేలం పాటలో 30 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ కింద అతన్ని జట్టులోకి తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లల్లో 25 శాతం చొప్పున అంటే 50 శాతం జరిమానా పడటం వల్ల అతని చేతికి వచ్చేదేమీ ఉండకపోవచ్చు. పైగా ఎదురు కట్నం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఇదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కేప్టెన్ రిషభ్ పంత్‌పైనా ఫైన్ పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+