సలుపుతున్న పాత గాయానికి మందు దొరికింది
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 255/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి తట్టుకోలేకపోయింది. కివీస్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ కీలక మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన జస్ ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్తో అతను 40 వికెట్లతో టీ20 ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.

మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడాడు. సొంతగడ్డపై ఈ విజయం సాధించడం తనకు చాలా ప్రత్యేక క్షణమని వ్యాఖ్యానించాడు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించాడు. ఇంతకు ముందు కూడా ఈ గ్రౌండ్ లో ఒక ఫైనల్ ఆడానని, అప్పుడు గెలవలేకపోయానని గుర్తు చేసుకున్నాడు. ఆ లోటు ఇప్పుడు తీరిపోయిందని పేర్కొన్నాడు. ఆ గాయం మానిపోయినట్టనిపిస్తోందని చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని బుమ్రా వివరించాడు. ఈ పిచ్ పై తనకు సంపూర్ణ అవగాహన, అనుభవం ఉందని, బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం వల్ల తన సర్వ శక్తులనూ ధారపోయాల్సి వచ్చిందని, అన్ని అస్త్రశస్త్రాలను కూడా ఉపయోగించాల్సి వచ్చిందని బుమ్రా చెప్పాడు. ఈ వికెట్ ఫ్లాట్గా ఉందని ముందే తెలుసునని, అందుకే అనుభవంతో బౌలింగ్ చేయడం చాలా ముఖ్యమని భావించానని అన్నాడు.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తన మానసిక స్థితి గురించి బుమ్రా వెల్లడించాడు. అకారణంగా తాను ఒత్తిడికి గురైనట్లు భావించానని, కాస్త ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు అనిపించిందని అన్నాడు. బౌలింగ్ లో ఎక్కడా ఏ లోపం లేకపోయినప్పటికీ, బంతులను బాగానే సంధిస్తున్నప్పటికీ ఎక్కువ ఒత్తిడి పెంచుకుంటున్నానని అనిపించినట్లు చెప్పాడు. గేమ్ ప్లాన్ మార్చానన, అదే తనకు పూర్తిగా కలిసివచ్చిందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ప్రపంచ కప్ ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకోవడం తన కెరీర్లో అత్యంత గొప్ప క్షణాలలో ఒకటని అన్నాడు.
ఈ టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్లలో మొత్తం 28.0 ఓవర్లు వేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు. 4/15 అతని అత్యుత్తమ ప్రదర్శన. టోర్నమెంట్ అంతటా నిలకడగా రాణించాడీ పేసర్. 12.42 సగటు, 6.21 ఎకానమీ రేటును నమోదు చేశాడు. 12.00 స్ట్రైక్ రేట్తో బంతులను సంధించాడు.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
టీమిండియాలో గుర్తింపునకు నోచుకోని స్టార్ ఆల్ రౌండర్- ఫైనల్ లో ఎక్స్ ఫ్యాక్టర్ -
టీమిండియాలో అతనితోనే మాకు ముప్పు, గేమ్ ఛేంజర్ - అక్కడే మా విజయం.. శాంట్నర్..!! -
పైనల్ లో అభిషేక్ పై సంచలన నిర్ణయం, కలిసొచ్చేనా - బూమ్ రాంగ్ అయ్యేనా..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
ఫైనల్లో ఊచకోత.. కివీస్పై రికార్డుల వర్షం! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బౌలింగ్ తో బేజార్- ఆ ఇద్దరి ఫ్లాప్ షో -
Ind vs NZ: ఫైనల్ వేళ టీమిండియాకు భారీ గుడ్ న్యూస్, 2024 రిపీట్..!! -
ఫైనల్ కోసం టీమిండియా బిగ్ ఛేంజ్- లక్కు మార్చే లెక్కతో బరిలోకి..!! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా?












Click it and Unblock the Notifications