RIP Gautam Gambhir: రోహిత్ ఫ్యాన్స్ ఫైర్, కుట్రలో కోహ్లీ..!!
టీమిండియా కోచ్ గంభీర్పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా గంభీర్ కామెంట్స్ పైన సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులతో ట్రోల్ చేస్తున్నారు. రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గంభీర్, కోహ్లీ కలిసి రోహిత్ పై కుట్రలు చేస్తున్నారంటూ ఫ్యాన్స్ పోస్టింగ్స్ చేస్తున్నారు. గంభీర్ లా గతంలో ఎవరూ వ్యవహరించ లేదని మండిపడుతున్నారు. ఇటు, సిడ్నీ టెస్టు లో రోహిత్ స్వయంగా తప్పుకున్నారని కెప్టెన్ బూమ్రా వెల్లడించారు.
గంభీర్ పై ఫైర్
ఆసీస్ టూర్ లో రోహిత్ వైఫల్యం పై గంభీర్ చేసిన కామెంట్స్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ను నచ్చలేదు. దీంతో, సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏకంగా రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ టీమిండియా లో ఏం చేసారో వివరిస్తూ ఫ్యాన్స్ మద్దతు గా కామెంట్స్ పెడుతున్నారు. 2021 నుంచి టెస్టుల్లో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత అవమాన కరంగా రోహిత్ ను తప్పిస్తారా అంటూ నిలదీస్తున్నారు.
గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమ్ ఇండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు.

కోహ్లీ టార్గెట్ అయ్యారా
సోషల్ మీడియాలో ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టార్గెట్ గా చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో కోల్డ్ వార్ మొదలు అయింది. కోచ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ తో పాటుగా కోహ్లీ, పంత్ పైన మండిపడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీని పైన గంభీర్ స్పందిస్తూ..తాను ఎవరి పైనా ఆగ్రహం వ్యక్తం చేయలేదని వివరణ ఇచ్చారు. ఆటలో గెలుపు, ఓటమలు సహజం అంటూ చెప్పుకొచ్చారు. ఇక, ఈ చివరి మ్యాచ్ తరువాత రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే సిడ్నీ లో ఈ రోజు ప్రారంభమైన టెస్టు నుంచి రోహిత్ తప్పుకున్నారు. తనంతటగా తానే తప్పుకున్నట్లు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన బూమ్రా టాస్ సమయంలో వెల్లడించారు.
What is "RIP GAUTAM GAMBHIR" ??
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 2, 2025
This entire reaction is related to the injustice done to Captain Rohit Sharma, wherein coach Gautam Gambhir wrongly answered the questions about Rohit's place in the 11 during press conference.
So here RIP = React if Possible, what GG did not do… pic.twitter.com/DlZykvwahv
సిడ్నీ టెస్టులో
కొందరు ఫ్యాన్స్ కోహ్లీని వివాదంలోకి లాగారు. గంభీర్, కోహ్లీ కలిసే రోహిత్ పైన కుట్రలు చేస్తున్నా రంటూ పోస్టింగ్స్ చేస్తున్నారు. ఇక, సిడ్నీ టెస్టులో టాస్ గెలిచిన బూమ్రా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు తొలి దశలోనే పెవిలియన్ బాట పట్టారు. కోహ్లీ, గిల్ కుదురుకుంటున్న కనిపించగా, గిల్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. లంచ్ తరువాత కొద్ది సేపటికే కోహ్లీ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్రీజులో పంత్ 32, జడేజా 11 పరుగులతో ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications