Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఒకే ఒక్కడు, ఆయన మాటే శాసనం..!!

టీం ఇండియా. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న జట్టు. టీం ఇండియా గతం.. వర్తమానం గమనిస్తే అనూహ్య మార్పు. యువ కెరటాలతో క్రికెట్ లో టీం ఇండియా సునామీల మారింది. వరుస విజయాలతో ఛాంపియన్ గా అవతరించింది. కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అయితే, గతానికి.. ఇప్పటికీ ఆ తేడా వెనుక కారణం ఏంటి. నిర్ణయాల్లో ఆ మార్పు ఎలా వచ్చింది. తెరు వెనుక ఆ వ్యహ కర్త ఎవరు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి ఆయన మాటే శాసనం.

కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!

క్రికెట్ లో ఏ ఫార్మాట్ అయినా.. పురుషులు - మహిళల టీం ఏదైనా.. ఛాంపియన్ టీం ఇండియా.
గతం లో టీం ఇండియా అనేక ఆటు పోట్లు చవి చూసింది. ఇప్పుడు గెలుపే లక్ష్యంగా ఆడుతోంది. వరుసగా ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 గా గెలిచిన భారత్ కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా రెండు సార్లు కప్ గెలవటంతో పాటుగా మూడో సారి గెలిచిన జట్టుగా రికార్డులు తిరగ రాసింది. 2025 ఆసియా కప్ ను గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024 లో జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది.

రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!
team-india-s-dominance-continues-the-strategist-behind-the-success-changing-cricket

ఇక, మహిళా క్రికెట్ టీంకు చారిత్రాత్మక కిరీటం దక్కింది. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ముంబయిలో జరిగిన మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రిపై గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. అయితే, వరుసగా ఈ కొత్త జోష్.. టీం కు మద్దతు వెనుక కీలక శక్తిలా నిలిచిన వ్యక్తం ఉన్నారు. ఆయనే జే షా... ప్రపంచ క్రికెట్‌లో టాప్ పోస్ట్ అయిన ఐసిసి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2022 లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ వచ్చి చేరాడు. కానీ బీసీసీఐ సెక్రటరీగా జే షానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐ నుండి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కి.. జే షా కెరీర్లో మరో ముఖ్యమైన ఘట్టం ఇది. ఐపీఎల్‌ని ప్రపంచంలోనే రిచెస్ట్ గేమ్‌గా మార్చేసిన జే షా... జే షా బీసీసీఐలో చక్రం తిప్పడం మొదలుపెట్టాకా ఐపీఎల్ స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయి.

Team India s Dominance Continues the Strategist Behind the Success Changing Cricket here the report

క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన జైషా

టీం ఇండియా సక్సెస్ వెనుక జై షా పాత్ర కీలకం. బీసీసీఐలో జే షా ఇమేజ్ ఏ స్థాయికి వెళ్లిందంటే.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించే భారత జట్టులో ఎవరెవరు ఉంటారో కూడా ఇంకా క్లారిటీ లేకముందే.. ఫిబ్రవరిలోనే జే షా ఒక ప్రకటన చేశారు. టీమిండియాను రోహిత్ శర్మనే లీడ్ చేస్తారంటూ జే షా ఎనౌన్స్ చేశారు. ఇక.. టీమిండియా కోసం తెర వెనుక తన వ్యూహాలను అమలు చేస్తూ... క్రికెట్ ను అటు ఆదాయం లో.. ఇటు ఆస్వాదించటంలోనూ ముందుచే విధంగా జై షా తన మార్క్ పాత్ర పోషిస్తున్నారు. ఇక.. తాజాగా టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఆడిన సెమీస్ , ఫైనల్ మ్యాచ్ లో స్వయంగా వీక్షించి.. టీం గెలిచిన ఆనందాన్ని తాను సొంతం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తి కర చర్చ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+