ఆ ఆటగాళ్లను IPL లో ఆడిస్తే పిచ్ లు ధ్వంసం చేస్తాం- సాధువుల హెచ్చరిక..!!
IPL 2026: ఐపీఎల్ వేళ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వేలం పూర్తయింది. తుది జట్లు ఖరారయ్యాయి. కెప్టెన్ల మార్పు దాదాపు ఖాయమైంది. ఇక.. ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. అయితే, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఐపీఎల్ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆటగాళ్లను ఆడిస్తే ఐపీఎల్ మ్యాచ్ పిచ్ లను ధ్వంసం చేస్తామని సాదువులు హెచ్చరించటం సంచలనంగా మారింది. దీంతో, ఇప్పుడు ఫ్రాంఛైజీలు ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.
మరి కొద్ది నెలల్లో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు సాదువులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న హింస ఐపీఎల్ పైన ప్రభావం చూపుతోంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతిస్తే, ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటామని మధ్యప్రదేశ్ కు చెందిన సాధువులు, హిందూ మత పెద్దలు హెచ్చరిక జారీ చేశారు. ఈ టోర్నీలో బంగ్లా ప్లేయర్లు ఆడేందుకు వీల్లేదని వారు హెచ్చరించారు.

తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన ఈ హింసాత్మక దాడిలో హిందూ సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఉజ్జయిన్ సాదువులు ఈ హెచ్చరిక చేసారు. బంగ్లా క్రికెటర్లు మ్యాచ్ లో ఆడితే ఆ మ్యాచ్ ను ఆపటానికి సాదువులు.. యోధులు స్టేడియం లో ప్రవేశిస్తారని తేల్చి చెప్పారు.
అంతే కాదు.. మైదానంలోని పిచ్ లను ధ్వంసం చేసి మ్యాచ్లకు అంతరాయం కలిగిస్తామని హెచ్చరిక చేశారు. అక్కడ హిందువుల పైన జరిగిన దాడులను అక్కడి అధికారులు పట్టించుకోక పోవటం పైన మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కు చెందిన ఏ క్రికెటర్ కూడా భారత్ లో జరిగే ఐపీఎల్ లో ఆడకూడదని అల్టిమేటం జారీ చేసారు. కాగా, IPL 2026 మినీ వేలంలో బంగ్లా దేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధరకు దక్కించుకుంది.
అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. 2016 నుంచి ఈ బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ ఆడుతున్నాడు. గత 10 సీజన్లలో అతడు ఇప్పటి వరకు అయిదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. ఈ ఐపీఎల్ లో బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ ఒక్కడే ఆడనున్నాడు. ఇక.. తాజాగా సాధువుల హెచ్చరికలతో కేకేఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
స్వదేశంలో టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే..! బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications