చంద్రబాబుముభావం
హోంపేజి టాక్ ఆఫ్ టుడే చంద్రబాబు Monday, May 03 2004
హైదరాబాద్:ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందన్న విషయంపైఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి సీనియర్నాయకులతో సోమవారం కూడా చర్చలు జరిపారు. ఎప్పుడూ మీడియాతోసన్నిహితంగా మెలిగే చంద్రబాబు నాయుడు రెండో విడత పోలింగ్పైఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ వెలువడినప్పటి నుండి ముక్తసరిగావిలేకరులతో మాట్లాడితున్నారు.
ప్రచారంజరుగుతున్నంత స్ధాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని చంద్రబాబునాయుడు ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నట్టు కన్పిస్తోంది.కరెంటు చార్జీల విషయంలో ప్రతిపక్షాలు విడిచిన వదంతులుసామాన్యజనంపై ప్రభావం చూపాయని ఆయన భావిస్తున్నారు. తామిచేసిన అభివృద్ధిని తమ నాయకులు ప్రజలకు సరిగాచెప్పలేకపోయారని ఆయన మధనపడుతున్నారు.టిడిపి సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్, ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు, ఎర్రన్నాయుడిపై ఆయన గుర్రుగా ఉన్నట్టుపార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ముగ్గురు తనను అనేక విషయాల్లోతప్పుదోవ పట్టించారని ఆయన అభిప్రాయపడుతున్నట్టుతెలిసింది.
తెలుగుదేశంప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న ఇంప్రెషన్ను ప్రజల్లోకలిగించడానికి చివరి సంవత్సరంలో కొన్ని సంక్షెమకార్యక్రమాలను ప్రకటించి ఉంటే బాగుండేదని చంద్రబాబునాయుడు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.
-
బాబుపైమహారథి
బాణం
- ఏంప్లాను బాబో
-
సైకిల్కు
అసమ్మతి
బ్రేక్లు