ఆది మానవుడికీహనుమంతుడికీ లింకు!
రామాయణంలోపేర్కొన్న చోటనే సముద్రంలో ముప్పై కిలో మీటర్లపొడవునా సున్నపురాతి వరుస ఉన్నట్టు ఇటీవల నాసా( నేషనల్రిమోట్ సెన్సింగ్ ఏజె న్సీ)ప్రకటించింది. ఇది సముద్రంలో మునిగిపోయినవంతెనలా ఉండడం విశేషం (కిందఉన్న నాసా ఫోటోలు చూడండి). ఇది భారత్-శ్రీలంకలను కలిపే ఒక సింధుశాఖలో ఉంది. ఇతిహాసాలకు, ఆధునిక సైన్సునుజోడించడం హాస్యాస్పదంగా అన్పించినా ఈవంతెన ఆశ్చర్యం కలిగించిక మానదు.
అయితే శాస్త్రవేత్తలురామాయణంలో పిడకల వేటకువెళ్ళడం లేదు. రామాయణం ప్రస్తావనలేకుండా 17,50,000 ఏళ్ళనాటిదిగా చెబుతున్న ఈ వంతెనను ఎలానిర్మించారు? ఈ ప్రాంతంలో ఆ కాలంలో నివసించినమానవులు ఎలా ఉండేవారన్నఅంశాలపై ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. రామాయణం త్రేతాయుగం (సుమారు 17 లక్షలఏళ్ళ)నాటిది.
ఆకాలంలో శ్రీలంకలో ఆది మానవులు నివసించినట్టుఆర్కియాలజిస్టులు చాలా కాలం క్రితమే పరిశోధనల్లో నిర్ధారించారు. ఆదిమానవుడు కోతిని పోలి ఉంటాడు.రామాయణంలో కూడా ఈ వంతెనకట్టింది శ్రీరాముడి పర్యవేక్షణ్లోవానర సైన్యమే అని రాసి ఉంది. ఆదిమానవుడి జీవితంతోపాటు ఆర్కియాలజిస్టులురామాయణాన్ని కూడా లింక్ చేసిపరిశోధనలు చేస్తే భారతీయ ఇతిహాసాలగొప్పతనం ప్రపంచానికంతటికీతెలిసే అవకాశం ఉంటుంది.
-సిహెచ్ శ్రీనివాసరావు
పదిహేడులక్షల ఏళ్ళ నాటి (రామాయణ కాలం) హనుమంతుడి ఊహా చిత్రం