వేడెక్కిన సిద్ధిపేట
హైదరాబాద్: సిద్ధిపేట అసెంబ్లీ ఉప ఎన్నికతెలంగాణ రాష్ట్ర సమితికి నల్లేరు మీద నడక కాబోదు.కాంగ్రెస్ -టిఆర్ఎస్ల మధ్య విభేదాలుదీనికి ప్రధాన కారణం. ఈ ఉపఎన్నికనుప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి ఇక్కడ నుంచి మాజీ మంత్రిచెరకు ముత్యం రెడ్డిని నిలబెట్టాలని శనివారం సాయంత్రంనిర్ణయించింది.
సిద్ధిపేట ఉపఎన్నికలో కాంగ్రెస్ కూడా పోటీ చేసేఅవకాశం ఉందని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ప్రకటించడంతో టిఆర్ఎస్ నాయకులు ఇబ్బందిలో పడ్డారు. టిఆర్ఎస్అధ్యక్షుడు చంద్రశేఖరరావు మేనల్లుడు, రాష్ట్ర మంత్రిహరీష్రావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్రెబల్స్ నుంచి ఆయనకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
చంద్రశేఖరరావుతోఇబ్బందులు కొని తెచ్చుకోవడమెందుకని కాంగ్రెస్అధిష్టానవర్గం అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిని పోటీకినిలబెట్టకపోవచ్చు. అయినా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు హరీష్రావు విజయానికి కృషిచేయడానికి సిద్ధంగా లేరు. వారు శనివారం సిద్ధిపేట నుంచిహైదరాబాద్కు ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో ఓడిపోతేటిఆర్ఎస్ తలకొట్టేసినంత పనవుతుంది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం సాధనకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది.
Recent
Stories
గాంధీజీ
చివరి
అడుగులు
పనివాళ్ళ
పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర
హింస
కెసిఆర్ఏం
చేస్తున్నట్లు?
రాజకీయరంగులు
పరిటాలకథ