ఠాగూర్ సభకు బిజెపి అడ్డు!
హోంపేజి టాక్ ఆఫ్ టుడే జనరల్ Monday, August 02 2004
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు.వారంరోజుల పాటు ఆయన అమెరికా, ఆ్రస్టేలియా తదితర దేశాలుసందర్శిస్తారు. తన విదేశీ పర్యటనకు పెద్ద ప్రచారం లేకుండాఆయన జాగ్రత్త పడుతున్నారు. అమెరికా, ఆ్రస్టేలియా వెళ్తాననిఆయన విలేకరులకు ఇష్టాగోష్టిగా చెప్పినా ఆయన సింగపూర్కూడా వెళ్ళనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. భార్యభువనేశ్వరి, కుమారుడు లోకేష్లతో ఆయన విదేశీ పర్యటనచేయనున్నారు.
చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధికధనిక రాజకీయ నాయకుడని ఆయనకు రెండు వేల కోట్లరూపాయలు ఆస్తులున్నాయని తెహల్కా డాట్కాం నాలుగేళ్ళ కిందటవెల్లడించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీప్రస్తావించడం చంద్రబాబు నాయుడికి ఇబ్బందికరంగా మారింది.చంద్రబాబు నాయుడు ఆస్తుల్లో అధిక భాగం విదేశాల్లోనే ఉన్నాయనిప్రత్యర్ధులు అప్పుడప్పుడు ఆరోపణలు చేయడంతోసామాన్యప్రజల మనసుల్లో అవినాటుకుపోయాయి.
ఈ నేపధ్యంలో తన విదేశీ పర్యటనవివరాలను గోప్యంగా ఉంచడమే ఉత్తమమని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా తీసుకున్నఅనేక నిర్ణయాలమీద, ఇచ్చిన అనుమతుల మీద రకరకాలవిచారణ సంఘాలను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేయడంతోఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. గతంలోలాలూప్రసాద్ యాదవ్, జయలలిత, కరుణానిధి రాజకీయ కక్షసాధింపు చర్యలకుఅ గురయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డితోతనకు ఎంతో కాలంగా ఉన్న సాన్నిహిత్యం వల్ల రాజకీయ కక్షసాధింపు చర్యలు ఉండవని చంద్రబాబు నాయుడు మొదట్లో అనుకున్నాఇప్పటి పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడికికాళ్ళూ చేతులూ ఆడని పరిస్ధితి కల్పించాలని కాంగ్రెస్అధిష్టానవర్గం నిర్ణయిస్తే వైఎస్ ఇక్కడి చేయగలిగింది ఏమీఉండదు.
Recent
Stories
తెలంగాణకు
ఎర్ర
జెండా
ఆరుదేశాల్లో
ఎన్నారై
శాఖ
ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట
సీను
ఆంధ్రపైజయ
చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు
రాజకీయంపై
వైయస్
సైకిల్దిగిన
బాబూఖాన్
సమైక్యనినాదం
ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య
అసంతృప్తి!
సచిన్టెండూల్కర్
-
ఇంటర్వ్యూ
హోంపేజి