అప్పుడూ ఇప్పుడూ ఒకేఒక్కడు!
హైదరాబాద్:తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్నిపాలించినతెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పుడూ ఇప్పుడూ కూడా ఒకేఒక్కడుగా వ్యవహరిస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోనూపార్టీలోనూ అన్నీ తానే అయి వ్యవహరించినఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడాఅదే విధంగా నడుచుకోవాల్సిన పరిస్ధితిఎదురయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకివెళ్ళాలని నేడు జరిగిన తెలుగుదేశం పోలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
పార్టీ ఏకార్యక్రమం చేపట్టాలన్నా తానే చొరవతీసుకోవలసి వస్తోందని, తమ పార్టీ నాయకుల్లోముందు చూపు, చొరవకొరవడిందని చంద్రబాబు నాయుడుఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది.అధికారంలో ఉన్నప్పుడు పవర్అనుభవించిన ముఖ్య నాయకులు ఇప్పుడుతామరాకు మీద నీటిబొట్టుల్లావ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ళతర్వాత పార్టీని తిరిగి అధికారంలోకితేవాలంటే మంచి డేటాతో ప్రజల ముందుకు వెళ్ళాల్సిన అవసరంఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.పార్టీ కేంద్ర కార్యాలయంలోఅత్యాధునిక గ్రంధాలయాన్ని, రిసోర్స్పర్సన్లను టిడిపి నాయకులుఉపయోగించుకోవడం లేదని, కేవలంతనకు మొహం చూపించివెళ్ళిపోతున్నారని ఈ మధ్య కొద్దిగాఆరోగ్యం క్షీణించిన చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారు.
కాంగ్రెస్ప్రభుత్వంపై ప్రజల నమ్మకంసన్నగిల్లాలంటే ఒక తురుపు ముక్కఅవసరమని, తెలుగుదేశం మేధావులెవరూమెరుపుల్లాంటి ఆలోచనలతో ముందుకు రావడంలేదని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడుతమతో ఏ విషయం సంప్రదించనిఅధినాయకుడికి ఇప్పుడు తమ సలహాలుఅవసరమయ్యాయా అని కొందరు నాయకులుగుసగుసలాడుకుంటున్నారు.అనేక జిల్లాల్లో టిడిపి నాయకులుకాంగ్రెస్లోకి వలసపోవడం కూడా చంద్రబాబునాయుడికి కలవరం కలిగిస్తోంది.
ఇటీవలికథనాలు
- పరిటాల రాజకీయ వైరాగ్యం
- మా తెలుగు బాబుకు చాడీల దండ!
- ఇక బాబు రోడ్షోలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్కుఅసమ్మతి బ్రేక్లు
-
చిరంజీవిరహస్య
ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం