చర్చలకుతూట్లు?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే;/SPAN> జనరల్ Tuesday, December 07 2004 ;?
హైదరాబాద్:ప్రభుత్వంతోనక్సలైట్ల చర్చలు ముందుకు సాగేసూచనలు కనిపించడం లేదు.ఆయుధాలు పక్కన పెడితే తప్పనక్సలైట్లతో చర్చలు జరిపేందుకుకాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాలేనట్లు కనిపిస్తోంది. ఆయుధాలను ఎజెండాచేయకుండా చర్చలు సాగించాలనేదినక్సలైట్ల ఆలోచన. ఇక్కడే ఇరుపక్షాలకు మధ్య సంధి కుదరడంలేదు. మెలమెల్లగా నక్సలైట్ల పట్లరాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కఠిన వైఖరిబయటపడుతోంది. సభలు, సమావేశాలనిర్వహణపై కూడా ప్రభుత్వం ఆంక్షలువిధిస్తోంది.
సిపిఐ(మావోయిస్టు) ప్రతినిధి వరవరరావుమంగళవారం వరంగల్లోమాట్లాడిన తీరు ప్రభుత్వానికి,నక్సలైట్లకు మధ్య వాతావరణంక్రమక్రమంగా చెడిపోతోందనేవిషయాన్ని పట్టిస్తోంది. గతతెలుగుదేశం ప్రభుత్వం కన్నాఘోరంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంవ్యవహరిస్తోందని ఆయనవిరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్డికిచర్చలపై చిత్తశుద్ధి లేదనివరవరరావు అంటూ రాజశేఖర్రెడ్డికి లేదంటూ ఆయనదారిలోనే హోంమంత్రి కె. జానారెడ్డి నడవడంవిడ్డూరంగా ఉందని అని అన్నారు. నిజానికి,జానారెడ్డికి, ఆ మాటకొస్తే ఏ హోం మంత్రికూడా తనదంటూ సొంత గొంతు ఈవిషయంలో బయటపడదు. ప్రభుత్వవైఖరిని హోం మంత్రి అమలు చేస్తూ ఉంటాడు.గత తెలుగుదేశం ప్రభుత్వ కఠినవైఖరితో కూడా హత్యకు గురైన హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికిలేదు. అయితే ఆ హోం మంత్రులు ఎటువైపుఉన్నారనేది మాత్రమే చర్చనీయాంశంఅవుతుంది.
ఇకపోతే,నక్సలైట్లతో గానీ, దేశంలోని ఇతరసాయుధ ఉద్యమకారులతో గానీ చర్చలవిషయంలో కేంద్ర ప్రభుత్వంస్పష్టంగానే ఉంది. ఆయుధాలు వదిలిపెట్టడానికిసిద్ధంగా ఉన్న తీవ్రవాదులతో చర్చలుజరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానిడాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకటికిరెండు సార్లు చెప్పారు. అప్పటికిఇప్పటికీ ఉన్న తేడా ఇదొక్కటే. ఆయుధాలువదిలిపెడితేనే చర్చలు జరుపుతామనిగత తెలుగుదేశం ప్రభుత్వం అంటే,ఆయుధాలు వదిలి పెట్టడానికి సిద్ధంగా ఉంటేచర్చలు జరుపుతామని ఇప్పటి కాంగ్రెస్ప్రభుత్వం అంటోంది. ఈ విషయాన్నిముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడాచెప్పారు. నిజానికి, ప్రభుత్వ చర్చలలోగానీ, హోం మంత్రి మాటలలో గానీమావోయిస్టులది పార్టీయే అని అంటున్నప్పటికీఅది సాంకేతికపరమైందే తప్పమరోటి కాదని రాజశేఖర్ రెడ్డి తనమాటలను బట్టి అర్థం అవుతోంది. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి ఇంతకుముందు పీపుల్స్వార్ పార్టీ అనో, ఇప్పుడుమావోయిస్టు పార్టీ అనో అని ఎరుగరు.నక్సలైట్ల గురించి ప్రస్తావించాల్సివచ్చినప్పుడు ఆయన తీవ్రవాదులు అనేపదప్రయోగమే చేస్తున్నారు. పైగారాయలసీమలోని ఫ్యాక్షనిజం కన్నాతెలంగాణలోని తీవ్రవాదంప్రమాదకరమైందని ఆయన అన్నారు.ఇదే రాజశేఖర్ రెడ్డి వైఖరిని పట్టిస్తోంది.రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నంతవరకు ఒక రకంగానూ, లేనప్పుడుమరో రకంగానూ ఉంటుందనడానికి కూడావీలులేదు. దాని అవసరాలను బట్టి ఆయాప్రభుత్వాలు నక్సలైట్లతోవ్యవహరించాల్సిన తీరునునిర్ణయించుకుంటారు. గుణాత్మకంగామార్పుకు అది ఏ మాత్రం అద్దంపట్టదు.
ఆయుధాలపైచర్చించడానికి కూడా తాము సిద్ధమేననిమావోయిస్టులు ఇప్పుడు అంటున్నారు.ఇదేమైనా ప్రభుత్వం అనుకూలంగాప్రతిస్పందించడానికి పనికి వస్తుందేమోవేచి చూడాల్సిందే. మొత్తం మీద చర్చలప్రక్రియ బెడిసి కొడుతున్నసూచనలే కనిపిస్తున్నాయి.
త్వరలోదాసరి
ఛానల్!
మాటలమరాఠీ!
ప్రెస్అకాడమీ
చైర్మన్గా
అమర్
కంచిపైఇంటిలిజెన్స్
కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను
మార్పులు!
సినిమా
వాళ్ళెక్కడ?
మీడియా
ఎక్కడ?
జయేంద్ర
విశేషాలు
ఒక
టిడిపి
నేత
విజయ
గాధ
రాంగోపాల్వర్మ
నాచ్
వివాదం
హెల్మెట్లో
దాగిన
అవినీతి
పురుగు
మన్మోహన్హంగ్!
రాజేంద్రప్రసాద్కు
రఘుపతి
వెంకయ్య
అవార్డు
షిండే
సక్సెస్
స్టోరీ
ఆది
మానవుడికీ
హనుమంతుడికీ
లింకు!
ఉదయభాను
విషాద
గాధ
ఉత్తమ
కంపెనీల్లో
సత్యం
హిందీలో
వీరప్పన్
సినిమా