లగడపాటి కోసం తెలంగాణపై రూటు మార్చిన జగన్?
అందుకు కారణం లగడపాటి రాజగోపాల్ అని సమాచారం. ఇటీవల నిత్యం తనపై విమర్శలు చేస్తున్న లగడపాటి పార్లమెంటు నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర చేపట్టి ఆయనకు షాక్ ఇవ్వాలని జగన్ వర్గం భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఈ నెల 15 నుంచి కృష్ణాలో ఓదార్పు యాత్ర చేపట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ఓదార్పు చేపడితే భారీగా నాయకులు, కార్యకర్తలు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీలో చేరతారని జగన్ వర్గం భావిస్తోంది. తద్వారా లగడపాటిని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రెండుమూడు సార్లు లగడపాటి జగన్ అనుచరులు తనను అడ్డుకున్న సమయాల్లోనూ అందుకు ధీటుగానే స్పందించారు. లగడపాటిని మానసికంగా దెబ్బతీయాలనే ప్రధానమైన వ్యూహంతోనే జగన్ మహబూబ్ నగర్ నుండి తన ఓదార్పును కృష్ణకు మళ్లించినట్లుగా పలువురు భావిస్తున్నారు.
అలాగే ప్రస్తుత తెలంగాణ ఉద్యమం తీవ్రత దృష్ట్యా తెలంగాణలో పర్యటించక పోవడమే ఉత్తమంగా కూడా జగన్ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మహబూబాబాదులో జగన్ను అడ్డుకున్న విషయాన్ని జగన్ వర్గం గుర్తుకు తెచ్చుకుంటోందని సమాచారం. తెలంగాణ తీవ్రత దృష్ట్యా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓదార్పు అక్కడ సరికాదని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ఓ ఖచ్చితమైన స్టాండ్ తీసుకునే వరకు అక్కడి జిల్లాల్లో ఓదార్పు కష్టమనే భావన జగన్ వర్గానికి చెందిన తెలంగాణ నేతల్లోనూ కనిపిస్తోందంట. గత ప్లీనరీ తర్వాత జగన్ వర్గం నేతలైన కొండా సురేఖ, గోనే ప్రకాశ రావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.