పకడ్బందీ వ్యూహంతోనే: రవితేజ విచారణ తేదీని మార్చిన సిట్
టాలీవుడ్ సినీ నటుడు రవితేజ విషయంలో సిట్ అధికారులు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తున్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రవితేజ విచారణ తేదిని రెండుసార్లు మార్చారు.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు రవితేజ విషయంలో సిట్ అధికారులు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తున్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రవితేజ విచారణ తేదిని రెండుసార్లు మార్చారు.జూలై 28వ, తేదిన రవితేజను విచారించే అవకాశాలున్నాయి.
డ్రగ్స్ కేసు విషయమై సిట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. రవితేజ విచారణతో తొలి విడత సినీ ప్రముఖుల విచారణ ముగిసే అవకాశం ఉంది.
అయితే విచారణకు హజరైన సినీ ప్రముఖులు ఈ కేసులో కొత్త కొత్త పేర్లను వెల్లడిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే రవితేజ సోదరుడు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు.
విచారణ సందర్భంగా ఈ విషయాలపై కూడ సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్తో సంబంధాల కారణంగానే రవితేజ సోదరులకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడ ఉంది.

రవితేజ విచారణ తేదీలు ఎందుకు మారాయి.
మాస్ మహరాజ రవితేజను సిట్ అధికారులు విచారించే తేదీలు ఎందుకు మారిపోయాయనే చర్చ సాగుతోంది.ఇప్పటికి రెండు దఫాలు రవితేజ విచారణ తేదిలను మార్చారు.ఈ నెల 28వ,తేదిన రవితేజను విచారించే అవకాశాలున్నాయి. ఎందుకు ఈ తేదిలు మార్చారనే విషయాలపై స్పష్టత రాలేదు.మరోవైపు పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ విచారణ తేదిని మార్చారనే ప్రచారం కూడ లేకపోలేదు. చార్మిని విచారించిన తర్వాత వచ్చే సమాచారం ఆదారంగానే రవితేజను విచారించాలని భావించి విచారణ తేదిలను మార్చారనే ప్రచారం కూడ లేకపోలేదు.
Recommended Video


భరత్ డ్రగ్స్ కేసు పై
రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. ఈ ఘటన జరిగిన నాటినుండి ఆయనతో రవితేజ దూరంగా ఉంటున్నారని టాలీవుడ్ వర్గాల కథనం. అయితే సిట్ విచారణ సందర్భంగా ఈ విషయాలను కూడ ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. అయితే కెల్విన్తో సంబంధాలపై రవితేజను ఆరాతీసే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు కెల్విన్ సమాచారాన్ని భరత్ ఫోన్ ద్వారానే సేకరించారని ప్రచారంలో ఉంది.ఈ విషయాలను కూడ ప్రస్తావించే అవకాశాలున్నట్టు ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.

పూరీ బ్యాచ్ సభ్యులే ఎక్కువ
ఇప్పటివరకు సిట్ విచారణకు హజరైనవారిలో దర్శకుడు పూరీ జగన్నాధ్ బ్యాచ్ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. తొలుత విచారణకు పూరీ జగన్నాథ్ హజరయ్యారు. ఆయన తర్వాత వరుసగా టాలీవుడ్ సినీ నటులు విచారణకు హజరౌతున్నారు. విచారణ సమయంలో ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబడుతున్నారు. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణకు హజరైన వారి నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.

జీషాన్ కీలక సమాచారం ఆధారంగా
డ్రగ్స్ కేసులో కెల్విన్తో పాటు జీషాన్ కూడ కీలకసమాచారాన్ని ఇచ్చారని ఎక్సైజ్ వర్గాల కథనం జీషాన్ ద్వారా టాలీవుడ్లోని కొందరికి డ్రగ్స్ చేరాయని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జీషాన్ ఇచ్చిన సమాచారాన్ని రూఢీ చేసుకొనేందుకుగాను సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు.జీషాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చార్మిని విచారించిన తర్వాత రవితేజను విచారించాలని భావించినట్టు ప్రచారంలో ఉంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications