పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్.. ఒకేసారి 78 వేల జాతీయ జెండాలు.. ఇండియాలో ఎక్కడంటే..
దయాది పాకిస్థాన్.. 18 ఏళ్ల రికార్డును భారత్ బ్రేక్ చేసింది. క్రికెట్లో కాదులెండి. బీహార్ జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేశారు. పాకిస్థాన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1857 సిపాయిల తిరుగుబాటులో మరణించిన భారత విప్లవ కారుడు వీర్ కన్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా బిహార్, భోజ్పూర్ జిల్లా, జగదీష్పూర్లో జాతీయ జెండాలను ఎగరవేశారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హాజరయ్యారు. 77 వేల మంది వరకు పౌరులు హాజరయ్యారు. వీరంతా వందేమాతరం ఆలపించారు. అందరూ జాతీయ పతాకాన్ని చేతపట్టి, జెండా గాలిలో ఊపుతూ నినాదాలు చేశారు. ఒకేసారి 75,000 మందికి పైగా పౌరులు జాతీయ పతాకాన్ని చేతితో ఎగరేయడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు దక్కింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులు కూడా దీనికి హాజరై, రికార్డును నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరుతో ఉండేది. లాహోర్లో పద్దెనిమిదేళ్ల క్రితం 56,000 మందితో కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడా రికార్డు భారత్ సొంతం అయ్యింది. పాకిస్థాన్ కన్నా.. 19 వేల మంది జనం ఎక్కువగా జెండాలను చేత పట్టుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా నినాదాలు చేస్తూ.. చరిత్రను లిఖించారు.
-
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
T20 World Cup Winner: వరల్డ్ కప్ విజేత ఎవరంటే ? జడేజా ప్రశ్నకు తేల్చేసిన గ్రోక్..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
నేడే గణేషుడిని కొలిచే బాలచంద్ర సంకష్ట చతుర్థి -
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు:వేసవిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..!! -
మనం మనం బరంపురం.. !! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!!












Click it and Unblock the Notifications