పార్టీని వదిలి వ్యవసాయం చేసుకుంటున్న టిడిపి ఎంపీ, కారణం అదేనా?
అనంతపురం: హిందూపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత నిమ్మల కిష్టప్ప ఆరు మాసాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారని తెలుస్తోంది. నేతలతో పొసగక పోవడం వల్లే ఆయన దూరంగా ఉంటున్నారంటున్నారు.
గత కొద్ది కాలంగా ఆయన వ్యవసాయం, సొంత పనులు మినహా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదని, అందుకు జిల్లాలోని కొందరు నేతలతో పొసగక పోవడమే కారణమని చెబుతున్నారు. అంతేకాదు, నిమ్మలకు మొదట్లో ఉన్నంత ప్రాధాన్యం ఇప్పుడు లేదని అనుచరులు వాపోతున్నారని తెలుస్తోంది.
హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను కాదని ఆయా నియోజకవర్గాలలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని తెలుస్తోంది. హిందూపురం పార్లమెంట్ పరిధిలో హిందూపురం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడు, ధర్మవరం, మడకశిర, పెనుకొండ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

సంబంధిత ఎమ్మెల్యేలు పిలిస్తే తప్ప కార్యక్రమాలకు కిష్టప్ప హాజరుకావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయచి. ఇటీవల పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడుకు కూడా కిష్టప్ప హాజరుకాలేదు. జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడుల్లో కూడా ఆయన కనిపించలేదంటున్నారు.
ఇందుకు ఆయా స్థానిక నేతలతో ఉన్న గ్యాప్ కారణమని చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్ పైకి కనిపించడం లేదని అంటున్నారు. ఈ గ్యాప్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన వాపోతున్నారని అంటున్నారు. మరోవైపు, ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయిందని, అందుకే ఎక్కువగా బయట తిరగడం లేదని, అంతే తప్ప మరో కారణం లేదని మరికొందరు చెబుతున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications