అందుకే స్టాలిన్ కు గుడ్ బై..! అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్..!
తమిళనాడులో ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (Vijay) టీవీకేకు వ్యతిరేకంగా డీఎంకే-అన్నాడీఎంకే కూటములు జట్టు కట్టబోతున్నాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ఢిల్లీలో కేజ్రివాల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్-బీజేపీ ఇలాంటి ప్రయత్నాలే చేసి నిండా మునిగాయి. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే-అన్నాడీఎంకే కూటములకు అదే గతి పట్టబోతోందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం కాంగ్రెస్ (Congress) కు ముందే తెలుసని ఎంపీ మాణిక్కం ఠాకూర్ (Manickam tagore) వెల్లడించారు.
రెండు ద్రావిడ పార్టీలు, చిరకాల శత్రువులు, రాత్రికి రాత్రే ఒక్కటయ్యారు, తమిళనాడు కోసం కాదు, లౌకికవాదం కోసం కాదు,
ఒక్క వ్యక్తిని, విజయ్ను ఆపడానికి అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ట్వీట్ చేసారు. కాంగ్రెస్ దీన్ని స్పష్టంగా గమనించి
బయటకు వెళ్లిపోయిందని ఆయన వెల్లడించారు. ఆర్ఎస్ఎస్/బీజేపీల బి-టీమ్తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరని స్టాలిన్ కు ఆయన చురకలు అంటించారు.

இரண்டு திராவிட கட்சிகள். வாழ்நாள் எதிரிகள்.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 8, 2026
ஒரே இரவில் ஒன்றானார்கள்.
தமிழகத்திற்காக இல்லை. மதச்சார்பின்மைக்காக இல்லை.
ஒரே ஒரு மனிதனை நிறுத்த
விஜய்யை.
காங்கிரஸ் தெளிவாக பார்த்தது
வெளியேறியது.
RSS/BJP-யின் B-டீமுடன் படுத்துக்கொண்டு உங்களை மதச்சார்பற்றவர் என்று சொல்ல… https://t.co/3KZJNscFIr
"స్థిరమైన ప్రభుత్వం" అనేది తమ అధికారాన్ని కాపాడుకుంటున్న రెండు భయపడిన పార్టీల రాజకీయ భాష అని మాణిక్కం ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ సరైన పనే చేసిందని, డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా? ఎవరు ద్రోహి ? అంటూ కాంగ్రెస్ ఎంపీ డీఎంకేకు చురకలు అంటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఊహించిన దాని కంటే తీవ్రంగా మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని విజయ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.














Click it and Unblock the Notifications