ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీనూ బాత్రా ?

అమెరికాలో దాదాపు ఏడు వారాల పాటు ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రాకు ఊరట లభించింది. ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఫెడరల్ జడ్జి ఆదేశించారు. అరెస్టు సమయంలో ప్రాథమిక హక్కులు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని న్యాయస్థానం నిర్ధారించింది. టెక్సాస్‌లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అరెస్టు చేసిన మీను బాత్రా ఏప్రిల్ 30న స్వేచ్ఛ పొందారు.

మీను తరపు న్యాయవాది దీపక్ అహ్లువాలియా మాట్లాడుతూ.. ఈ ఫలితం పట్ల తమకు అత్యంత ఆనందంగా ఉందని తెలిపారు. "ఈ ఆరేడు వారాలు చాలా క‌ష్టంగా గడిచాయి. ఈ క్షణం వస్తుందని మాకు తెలుసు. కానీ, ఇంత సమయం పడుతుందని ఊహించలేదు" అని అహ్లువాలియా పేర్కొన్నారు. ముందస్తు నోటీసు, ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండానే మీను బాత్రాను నిర్బంధించారని ఫెడరల్ జడ్జి తన తీర్పులో స్పష్టం చేసినట్లు వివరించారు.

who-is-meenu-batra-and-what-happened-to-her-and-how-she-released-from-ice-detention

టెక్సాస్‌లో రెండు దశాబ్దాలకు పైగా సర్టిఫైడ్ కోర్టు ఇంటర్‌ప్రెటర్‌గా మీను బాత్రా పనిచేస్తున్నారు. హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో ఆమెకు అపారమైన ప్రావీణ్యం ఉంది. మార్చి 17న ఆమె విస్కాన్సిన్‌లోని మిల్వాకీకి వృత్తిపరమైన పనుల నిమిత్తం వెళ్లేందుకు హార్లింగెన్‌లోని వ్యాలీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఐస్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను రేమండ్‌విల్లేలోని ఎల్ వల్లే డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు.

మీను బాత్రా విడుదలైనప్పటికీ, ఆమె అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు చేస్తున్న చట్టపరమైన పోరాటం ఇంకా ముగియలేదని న్యాయవాది అహ్లువాలియా స్పష్టం చేశారు. "పోరాటం ఇంకా ముగియలేదు. మీను బయటకు వచ్చారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడే ఉంచడం ముఖ్యం. ఆమెకు ఎలాంటి సంబంధం లేని మూడో దేశానికి పంపే ప్రయత్నాలను మేము చివరి వరకు ప్రతిఘటిస్తాం" అని ఆయన గట్టిగా చెప్పారు. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సరైన చట్టపరమైన నోటీసు లేకుండా లేదా న్యాయవాది సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహించకుండా అధికారులు ఆమెను తిరిగి అరెస్టు చేయలేరని స్పష్టం చేశారు.

సుమారు 35 సంవత్సరాల క్రితం మీను బాత్రా భారత్ నుంచి అమెరికాకు వచ్చారు. సిక్కు మత విశ్వాసాల కారణంగా ఆమె తల్లిదండ్రులు హత్యకు గురవడంతో ఆమె ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో ఆమెకు "విత్‌హోల్డింగ్ ఆఫ్ రిమూవల్" హోదా లభించింది. ఈ హోదా ఒక వ్యక్తిని హింసకు గురయ్యే ప్రమాదం ఉన్న దేశానికి తిరిగి పంపకుండా రక్షణ కల్పిస్తుంది. ఇది పూర్తిస్థాయి ఆశ్రయం కానప్పటికీ, ఆమె దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

"నేను ఇక్కడ చట్టబద్ధంగానే ఉన్నాను. నన్ను దేశం నుంచి పంపలేరు. నాకు చింత లేదు. ఇక్కడే ఉండి పనిచేయాలనుకుంటున్నాను" అని నిర్బంధంలో ఉన్నప్పుడు మీను బాత్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమెకు నలుగురు పిల్లలు (అమృత, లూకాస్, ఆర్యన్, జాస్పర్) ఉన్నారు, వారందరూ అమెరికా పౌరులే. వారిలో చిన్న కుమారుడు జాస్పర్ యూఎస్ సైన్యంలో పనిచేస్తున్నారు.

మీను బాత్రా న్యాయవాదుల బృందం ఇప్పుడు ఆమె చిన్న కుమారుడు జాస్పర్ ద్వారా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరతామని, నాలుగు నుంచి ఆరు నెలల్లో గ్రీన్ కార్డ్ మంజూరయ్యే అవకాశం ఉందని అహ్లువాలియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ న్యాయపోరాటం ఆమెకు అమెరికాలో స్థిరమైన భవిష్యత్తును కల్పించే లక్ష్యంతో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+