AI దెబ్బకు UPSC రద్దవుతుందా ? బిగ్ ట్విస్ట్..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఆటోమేషన్ వాడకంతో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థల ఉనికిపై చర్చ మొదలైంది. ప్రతీ ఉద్యోగాన్నీ ఏఐ సాధించే పరిస్ధితి ఉన్నప్పుడు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే యూపీఎస్సీ వల్ల ప్రయోజనం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని మోడీ ఆర్ధిక సలహామండలి సభ్యుడిగా ఉన్న ఆర్దిక వేత్త సంజీవ్ సన్యాల్ కూడా ఉన్నారు.
తాజాగా సంజీవ్ సన్యాల్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల విలువను ప్రశ్నించారు. సాంప్రదాయ విశ్వవిద్యాలయాల పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ.. వేగంగా మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు, అప్రెంటిస్షిప్లు, కృత్రిమ మేధస్సుకు సిద్ధంగా ఉండే విద్య వైపు మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత కోసం యూపీఎస్సీ పరీక్షలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రయత్నించడాన్ని 'సమయం వృధా' అని సన్యాల్ అభివర్ణించారు.

ఏఐ-ఆధారిత భవిష్యత్తు వాస్తవాలకు భారతదేశ విద్యా, వృత్తి ఆశయాలు ఎంతవరకు సరిపోతున్నాయో తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భారతదేశంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు, సాంప్రదాయ విశ్వవిద్యాలయ డిగ్రీల పట్ల ఉన్న వ్యామోహాన్ని టార్గెట్ చేసేలా సన్యాల్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన దృష్టిలో ప్రస్తుత పద్ధతులు పాతకాలపు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఇవి వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాలు, అనుకూలత, ఆవిష్కరణల కన్నా స్థితి, స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.
కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, నిరంతర ఆవిష్కరణలతో కూడిన ఈ యుగంలో, 20వ శతాబ్దపు వృత్తి నమూనాలకు కట్టుబడి ఉండటం వల్ల 21వ శతాబ్దపు సవాళ్లకు సిద్ధంగా లేని శ్రామికశక్తిని ఉత్పత్తి చేసే ప్రమాదం ఉందని సన్యాల్ హెచ్చరిస్తున్నారు. ఈ దృక్పథం ప్రస్తుత అవసరాలకు తగినది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఎస్సీ పరీక్షలపై సన్యాల్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఏటా లక్షలాది మంది అభ్యర్థులు కొద్దిపాటి సివిల్ సర్వీస్ పోస్టుల కోసం పోటీపడతారు. ఇందులో 99 శాతానికి పైగా వైఫల్య రేట్లను ప్రస్తావిస్తూ.. ఒకే పరీక్ష కోసం సంవత్సరాలు వెచ్చించడం వల్ల కలిగే తక్కువ సక్సెస్ రేటు, అధిక వ్యయాన్ని సన్యాల్ వివరించారు.

తన విమర్శ నిజమైన ఆసక్తి గల సివిల్ సర్వెంట్లు లేదా ఉద్దేశపూర్వక అభ్యర్థులపై కాదని సన్యాల్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన 'వృత్తిపరమైన యూపీఎస్సీ ఆశావహులుగా చెప్పుకునే వారిని టార్గెట్ చేశారు. వీరు విజయవంతం కాకపోయినా పదేపదే పరీక్షలకు ప్రయత్నించి, తమ ఉత్పాదక సామర్థ్యంలోని విలువైన సంవత్సరాలను కోల్పోతున్నారని తెలిపారు. అధిక వైఫల్యాలతో కూడిన ప్రక్రియ ద్వారా స్థిరత్వం కోసం శ్రమించడం వెనుక ఉన్న తర్కాన్ని ప్రశ్నిస్తూ, "మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకుని, బ్యూరోక్రాట్ ఎందుకు కావాలి?" అని గతంలోనే ఆయన వ్యాఖ్యానించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications