స్వరం మార్చిన రాందేవ్ : ప్రధాని ఎవరో చెప్పలేం..
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడే రాందేవ్ బాబా స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఆయన తన వైఖరి మార్చుకున్నారా..లేక..మోదీ తిరిగి ప్రధాని కారని భావిస్తున్నారా అనే చర్చ మొదలైంది. మరి..రాందేవ్ కాంగ్రెస్ కు మద్దతిస్తారా..
కాబోయే ప్రధాని ఎవరనే విషయంపై ప్రముఖ యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయా లు చాలా క్లిష్టతరంగా మారుతున్నాయని... భవిష్యత్ లో దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఎవరనే విషయం చెప్పలే మని రాందేవ్ మధురైలో వ్యాఖ్యానించారు. రామేశ్వరంలో నిర్వహించిన జాతీయ భారత్ స్వాభిమాన్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి గాని ఏ వ్యక్తికి గాని మద్ధతు ఇవ్వనని రాందేవ్ స్పష్టం చేశారు. తాను రాజకీయాలపై దృష్టి సారించడం లేదన్నారు. భారతదేశం హిందూ దేశం చేయాలని లేదని, ఆధ్యాత్మకంగా మన దేశంలో యోగా, వైదిక్ ధర్మాలను ప్రచారం చేయడమే తన లక్ష్యమని రాందేవ్ బాబా వివరించారు.

సాధారణంగా రాందేవ్ బాబా ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాందేవ్ ఇప్పుడు ప్రధాని పదవి పై వ్యాఖ్యలు చేయటం కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు..బిజెపి కి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు రాందేవ్ ను ప్రభావితం చేసాయా అనే అనుమానం కలుగుతోంది. ఇదే సమయంలో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వని రాందేవ్ బాబా తేల్చి చెప్పారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications