కోల్ ఇండియాలో భారీగా నోటిఫికేషన్స్.. అప్లై చేసుకోండిలా..
ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా నుంచి మేనేజ్ మెంట్ ట్రైనీ పేరిట భారీగా నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. బీటెక్ తో పాటు ఎంబీఏ, సీఏ లాంటి కోర్సులు చేసిన వారికి కూడా కోల్ ఇండియాలోని పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జనవరి 15 నుంచి అప్లికేషన్ ప్రారంభం అయింది. ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు, గడువు తేదీలు, అర్హతలు, వయోపరిమితి తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం పోస్టుల సంఖ్య : 434 , కమ్యూనిటీ డెవలప్ మెంట్ (20), ఎన్విరాన్ మెంట్(28), ఫైనాన్స్ (103), లీగల్(18), మార్కెటింగ్(25), మెటీరియల్స్ మేనేజ్ మెంట్(44), పర్సనల్ హెచ్ఆర్(97), సెక్యూరిటీ(31), కోల్ ప్రిపరేషన్ (68),

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 15/01/2025
అప్లికేషన్ చివరి తేదీ : 15/02/2025 సాయంత్రం 6 గంటల వరకు
పేమెంట్ చివరి తేదీ : 15/02/2025
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1180/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు లేదు.
వయోపరిమితిని 30 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లో ఉంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(CBT)విధానం ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 100 మార్కులు ఉంటుంది. మొదటి పేపర్ లో జనరల్ నాలెడ్జ్, రెండో పేపర్ లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలను వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications