Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LIC Jobs: ఎల్ఐసీలో కొలువులు.. దరఖాస్తు చేసుకోండిలా..

దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ నియమించుకోనున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు శిక్షణ పూర్తి చేసిన వారు మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దీన్ని రెండేళ్లకు కూడా పెంచే అవకాశం ఉంది. అయితే ఈ ఉద్యోగంలో చేరే వారు నాలుగేళ్లపాటు పనిచేస్తామని బాండ్‌ రాయాల్సి ఉంటుంది.

ఎవరికి ఎన్ని పోస్టులు

ఎవరికి ఎన్ని పోస్టులు

మొత్తం 300 ఏఏఓ ఖాళీల్లో ఎస్సీ-50, ఎస్టీ-27, ఓబీసీ-84, ఈడబ్ల్యూఎస్‌-27, అన్‌రిజర్వుడ్‌-112 కేటాయించారు. 01.01.2023 నాటికి అభ్యర్థుల వయసు 21-30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉండనుంది.

ఎంపిక విధానం

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి.

300 మార్కులు

300 మార్కులు

ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 46. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 41 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రధాన పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ఈ పరీక్ష 300 మార్కులు ఉంటాయి. డిస్క్రిప్టివ్‌ 25 మార్కులు ఉంటాయి. ప్రధాన పరీక్షలో
అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ

మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ గరిష్ఠ మార్కులు 60. ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 30. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 27 మార్కులు సాధించాలి. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెగ్గిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. అందులో అర్హత సాధించిన వాళ్లను చివరిగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు రూ.700 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.85 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2023గా ఉంది. ఫిబ్రవరి 17, 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ మార్చి 18న నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+