NEET-PG 2024 పరీక్షల తేదీ ఇదే
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల తేదీ వెలువడింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జులై 7వ తేదీన నీట్ పీజీ (NEET PG 2024) పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. పీజీ అర్హత సాధించడానికి కటాఫ్ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన షెడ్యూల్ అయింది.
నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది మార్చి 3వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పోస్ట్గ్రాడ్యుయేషన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. గత ఏడాది నీట్ పీజీ పరీక్షలు మార్చి 5వ తేదీన జరిగాయి. ఈ ఏడాది కూడా మార్చి 3 లేదా 5 తేదీల్లో ఉంటాయనే అంచనాలు మొదట్లో వెలువడ్డాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమౌతోన్నారు.

తాజగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించిన షెడ్యూల్ను బట్టి చూస్తే ఈ ఏడాది మార్చిలో నీట్ పీజీ పరీక్షలు ఉండట్లేదు. అవి జులై 7వ తేదీకి వాయిదా పడినట్టయింది. ఇక నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఈ సంవత్సరం నిర్వహించట్లేదు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 ఆధారంగా నీట్ పీజీ పరీక్షల తరువాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. గత ఏడాదే ఈ రెగ్యులేషన్స్ను అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర వివరాల కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications