బోల్డ్ సీన్స్తో రచ్చ రచ్చ... ‘టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యష్తో కలిసి నటిస్తున్న 'టాక్సిక్" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు 'టాక్సిక్' మూవీ కియారా అద్వానీ కెరీర్లోనే అత్యంత బోల్డ్ సినిమాగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమా మెటీరియల్ ఈ సినిమాపై ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఓ తాజా ఇంటర్వ్యూలో తాను 'టాక్సిక్'లో భాగం కావడానికి ఎందుకు అంగీకరించిందో కియారా అద్వానీ వెల్లడించింది.
"నేను కథ విన్నప్పుడు ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. ఓ యాక్టర్ కోరుకునే ప్రతీదీ అందులో ఉంది. నా కెరీర్లో ఇలాంటి పాత్రను పోషించగలననే ఆత్మవిశ్వాసం నాకు వచ్చిందనిపించింది," అని కియారా అద్వానీ పేర్కొన్నారు. ఆమె పాత్ర గురించి వివరాలు చెప్పనప్పటికీ.. యష్తో కలిసి నాడియాగా ఆమె నటించిన బోల్డ్ సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

కియారా అద్వానీ ఏం చెప్పిందంటే?
అదే సంభాషణలో ఒక నటిగా ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకపోవడం గురించి కూడా కియారా అద్వానీ మాట్లాడింది. కియారా అద్వానీ మాట్లాడుతూ.. "మహిళలను ఒకే మూసలో ఇరికించడం లేదా ఒకే మూసలో బంధించడం నాకు ఇష్టం లేదు. మహిళా పాత్రలు బలంగా, వాస్తవికంగా, సంక్లిష్టంగా ఉండాలని కియారా పేర్కొంది. ఇది 'టాక్సిక్' చిత్రంలో ఆమె రాబోయే పాత్రకు సంబంధించిన సూచన కావచ్చు.
గతేడాది కియారా అద్వానీ పోస్టర్ విడుదలైనప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చింది, "శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా నా నుంచి చాలా ఆశించిన పాత్ర ఇది. ఇది నన్ను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలలో ఇదే అత్యంత కష్టమైనది. నెలల తరబడి కఠోర శ్రమ. ఓ నిర్భయమైన ముందడుగు. ఈ ఫస్ట్ లుక్కు ఇంత ప్రేమ లభించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేను." అని కియారా అద్వానీ పేర్కొన్నారు.
గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' చిత్రాన్ని ఏకకాలంలో ఇంగ్లీష్, కన్నడ భాషలలో చిత్రీకరించారు. దీనిని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, అనేక ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ల క్రింద వెంకట్ కె. నారాయణ్, యష్ నిర్మించారు. ఈ చిత్రంలో యష్, కియారాతో పాటు నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కూడా నటించారు.














Click it and Unblock the Notifications