Anasuya:చీరకట్టులో యాంకర్ అనసూయ...అందం అదుర్స్..!!
బుల్లితెరపై తన మాటలతో, వెండితెరపై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్, తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. నిత్యం ట్రెండీ అవుట్ఫిట్లతో సందడి చేసే అనసూయ, పట్టుచీరలో చేసిన ఈ ఫోటోషూట్ నెట్టింట వైరల్గా మారింది.
సందర్భం ఏదైనా తన గ్లామర్తో అలరించే అనసూయ, ఈసారి పూర్తిగా సాంప్రదాయ లుక్లోకి మారిపోయారు. కళ్లుచెదిరే అందమైన పట్టుచీర ధరించి, దానికి తోడు తలలో మూరెడు మల్లెపూలను అలంకరించుకున్నారు. ఈ క్లాసిక్ కాంబినేషన్ అనసూయ అందాన్ని రెట్టింపు చేసింది. చీరకట్టుకు తగిన ఆభరణాలు ధరించి, తెలుగుదనం ఉట్టిపడేలా ఆమె ఇచ్చిన ఫోజులు ఫొటోల్లో అద్భుతంగా కనిపిస్తున్నాయి.

సొగసైన చీరకట్టు, మల్లెపూలతో నిండిన జడ, చెరగని చిరునవ్వు.. వీటితో అనసూయను చూసిన అభిమానులు కళ్లు తిప్పుకోలేకపోయారు. ముఖ్యంగా పట్టుచీర, మల్లెపూల కలయిక ఆమెకు మరింత శోభను తెచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. "అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు", "యాంకర్ అయినా.. నటి అయినా.. సంప్రదాయ దుస్తుల్లో మీరే క్వీన్" అంటూ అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను సరదాగా పలకరిస్తుంటుంది అనసూయ. అయితే కొంతమంది కొంటె ప్రశ్నలు వేస్తుంటారు. అయితే వారికి సరైన సమాధానం చెబుతుంటుంది. ఇక ఎవరైనా లైన్ క్రాస్ చేసి బిహేవ్ చేశారో.. వారి భరతం కూడా పడుతుంది. కొన్ని సందర్భాల్లో అనసూయ ట్రోలింగ్కు గురవుతుంటుంది. ఎవరు ఏమి చేసిన,సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినా.. వాటిని పట్టించుకునే అంత టైమ్ లేదని చెబుతుంది. ఇవ్వాల్సిన టైమ్లో ట్రోలర్స్కు గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనసూయ.
పలు వెబ్ సిరీస్లు, సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ, సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన అప్డేట్లను పంచుకుంటూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటారు. ఈ కొత్త ఫోటోషూట్ ఆమె రాబోయే ప్రాజెక్ట్లకు సంబంధించినదా లేదా కేవలం సంప్రదాయంపై ప్రేమతో చేసినదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఈ చీరకట్టులో అనసూయ చూపించిన పరవశం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications