"అఖండ 2" రిలీజ్ ఈ ఏడాది లేనట్టే.. బుక్ మై షో లో ఇది చూశారా ??
తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు.. ఏకంగా దైవాన్ని బలంగా నమ్మే నందమూరి బాలకృష్ణ.. డివోషనల్ కాన్సెప్ట్ తో చేసిన "అఖండ 2" చిత్రానికి చిక్కులు తప్పట్లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం.. అంతా అనుకున్నట్టు జరిగుంటే.. ఈరోజు ( డిసెంబర్ 5, 2025 ) రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉండేది. ఈలలు వేస్తూ, కేకలు వేయాల్సిన గొంతులు అన్ని ఇప్పుడు మూగుబోయాయి. నందమూరి అభిమానుల హార్ట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనాన్షియల్ వివాదాల కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా రిలీజ్పై తాత్కాలిక నిషేధం విధించడంతో నిర్మాతలకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అంటున్నారు.
దాంతో ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఈ సినిమాకి సంబంధించిన వివాదం సర్దుమనుగుతోంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని భావిస్తున్న తరుణంలో బుక్ మై షో పోస్ట్ ఇప్పుడు బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

బుక్ మై షో పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..
బుక్ మై షోలో Akhanda 2 ఓపెన్ చేస్తే అక్కడ "Releasing in 2026" అని చూపించడం అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ మిస్ అయితే మరికొద్ది రోజుల్లో అవతార్ 3 రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ తరుణంలో ఈ మూవీ అప్పుడు రిలీజ్ అయితే కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. దీంతో కొత్త ఏడాదిలో విడుదల చేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పుడు ఈ వార్తలను నిజం అనిపించేలా రిలీజ్ డేట్ విషయంలో 2026 ఉండడం బాలయ్య అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. దాంతో ఈ స్క్రీన్ షాట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

కాగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా రాబోతుంది.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications