తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తున్న ప్రొద్దుటూరు, రాజమండ్రి!
తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా నిర్మాత సినిమా తీయాలంటే సొంత డబ్బును ఖర్చుపెట్టరు. బయట నుంచి వడ్డీకి డబ్బులు తెస్తారు. అలా వడ్డీకి డబ్బులిచ్చేవారు వేళ్లమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం కాబట్టి. కోట్ల రూపాయలు వడ్డీకిస్తున్నారంటే దానికి వచ్చే వడ్డీ కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అయితే అది చాలా పెద్ద సంఖ్య కావడంతో అందరికీ ఆ స్థాయి ఉండదు.. ఉన్నా మరికొందరు ముందుకు రాదు. కొందరు మాత్రమే ధైర్యంగా వడ్డీకిచ్చి, సినిమా విడుదలవడానికి ముందురోజే ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటారు. ఆ సత్తా ఉన్నవారే పరిశ్రమలోనివారికి డబ్బులు వడ్డీకిస్తుంటారు.
ఫైనాన్షియర్లకంటే వీరేం పెద్దవారు కాదు
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఏ నిర్మాత తన సొంత డబ్బుతో సినిమాలు తీయడంలేదు. వడ్డీకి ఫైనాన్స్ తీసుకొని ఆ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రాంతాలవారీగా అమ్మకాలు జరిపి వచ్చిన డబ్బును ఫైనాన్షియర్లకు కట్టేస్తారు. గతంలో లేదుకానీ.. ఇప్పుడు మాత్రం ఓటీటీ డీల్స్ ద్వారా వచ్చే డబ్బు నిర్మాతకు బోనస్ లాంటిది. థియేట్రికల్ హక్కుల్లో వస్తే మరో బోనస్ అనుకోవచ్చు. ఒక స్థాయి ఉన్న హీరో సినిమా అయితే మ్యూజికల్ హక్కుల ద్వారా కూడా డబ్బులు వస్తాయి.

శాటిలైట్ రైట్స్ అమ్మకం ద్వారా, ఇతర భాషల్లో రీమేక్ కోసం ఎవరైనా అడిగితే అమ్మడంద్వారా సాధ్యమైనంత మేరకు నిర్మాతకు డబ్బులు వస్తాయి. ఒకవేళ సినిమా ఫ్లాపైనా వడ్డీకి తీసుకున్న డబ్బులు మాత్రం కచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఊరుకోరు. అంటే కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న దర్శకులు, హీరోలు, నిర్మాతలు కూడా ఈ ఫైనాన్షియర్ల కంటే చిన్నవారే అని చెప్పొచ్చు.
టీసిరీస్, సరిగమ చూసుకుంటున్నారు
ప్రస్తుతానికి మన తెలుగు సినీ పరిశ్రమను ప్రొద్దుటూరుకు చెందిన రెండు ఫైనాన్షియర్స్ సిండికేట్స్, రాజమండ్రికి చెందిన మరో ఫైనాన్సియర్ సిండికేట్స్ శాసిస్తున్నాయి. సినిమాలు ఆడనప్పుడు, నిర్మాత నష్టపోయినప్పుడు మానవత్వంతో కాస్తంత వెనక్కు తగ్గుతున్నారు కానీ తర్వాత సినిమాకైనా వారి డబ్బును వారు వసూలు చేసుకుంటున్నారు. అయితే అటువంటి ఫైనాన్షియర్లను కూడా మన తెలుగు నిర్మాతలు ఇబ్బందులు పెడుతుండటంతో చాలావరకు సినిమాలకు ఫైనాన్స్ చేయడాన్ని అందరూ మానుకున్నారు. ప్రస్తుతానికి ప్రొద్దుటూరు, రాజమండ్రివారే చేస్తున్నారు.
మన తెలుగు నిర్మాతలు జాతీయ స్థాయిలో సరిగమ, టి సిరీస్ లాంటి సంస్థల నుంచి ఫైనాన్స్ తీసుకుంటున్నాయి. వారు ముక్కుపండి మరీ వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సంస్థలను కూడా ముప్పుతిప్పలు పెట్టిన నిర్మాతలున్నారని ఇండస్ట్రీలో టాక్. మరి ఫైనాన్షియర్లు క్రమంగా తగ్గుతుండటంతో భవిష్యత్తులో నిర్మాతలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయం వినపడుతోంది. ప్రస్తుతానికి ప్రొద్దుటూరు, రాజమండ్రి చేతుల్లోనే పరిశ్రమ ఉంది. అంతకుమించి నిర్మాతలకు డబ్బులిచ్చేవారెవరూ కనపడటంలేదు.
-
మరో సూపర్ కాన్సెప్ట్తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో హీరో రాజశేఖర్ మిస్ అయిన పాత్ర ఇదే..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications