పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
బాలీవుడ్లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది కంగనా రనౌత్. సినిమా హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంది కంగనా. ఆమె తాజాగా చంద్రముఖి 2 సినిమాలో నటించారు. పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్..
శ్రీకృష్ణుడు ఆశీర్వాదంతో...
శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు. గుజరాత్లోని ప్రఖ్యాత శ్రీకృష్ణాలయం 'ద్వారకాధీష్'ను శుక్రవారం సందర్శించిన కంగనా తన పొలిటికల్ ఎంట్రీపై ఈ విధంగా స్పందించారు. అనంతరం అక్కడ ఆమె పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే మీడియా ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ''శ్రీ కృష్ణ కీ కృపా రహీ తో లాంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను) అని తెలిపారు.

సుమారు ఆరువందల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠత సాధ్యమైందని, ఇది కూడా బీజేపీ నేతృత్వంలోనే జరిగిందని, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వం కృషితోనే భారతీయులమైన మనం ఈ రోజును చూడగలుగుతున్నాం. ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మిస్తున్నారు. సనాతన ధర్మ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేయాలని ఆమె అన్నారు.
క్షణం తీరిక దొరికినా, ఇక్కడికి వచ్చేస్తా...
ద్వారకా ఒక దివ్య నగరం. ఇక్కడ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రతి కణంలోనూ ద్వారకాధీష్ ఉంటుంది. ఆయనను చూడగానే నేను ధన్యురాలిని అవుతాను. వీలైనంత వరకు స్వామి వారి దర్శనం కోసం ఇక్కడికి రావడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. పని నుంచి క్షణం తీరిక దొరికితే చాలు ఇక్కడికి వస్తుంటాను' అని కంగనా అన్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం అవశేషాలను యాత్రికులు సందర్శించే సదుపాయాన్నికల్పించాలని కంగనా రనౌత్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మీడియాతో కంగనా దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ', 'తనూ వెడ్స్ మను పార్ట్ 3 వంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఆమె నటించిన తేజస్ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో కంగనా ఫోర్స్ పైలట్ పాత్రను పోషించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications