'నాన్నోయ్ పిన్ని వచ్చిందీ.. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్'
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ వందో సినిమాని ఇటీవలే ప్రారంభించారు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా దేవుడి పటాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్తో రా కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ మూవీ పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
కింగ్ 100 సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందులో ఒక కథానాయికగా సీనియర్ నటి టబుని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ క్రేజీ హీరో హీరోయిన్ కాంబినేషన్స్ లో నాగార్జున - టబు జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి గతంలో రెండు సినిమాల్లో నటించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమా కావడం, అందులో టబు నటించనుందని వార్తలు వస్తుండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఇదే నిజమైతే ఈ సినిమా మరింత క్రేజీగా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు.1995లో అఖిల్ అక్కినేని చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన 'సిసింద్రీ' సినిమాలో టబు ఓ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. 'ఆటాడుకుందాంరా అందగాడా' అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడారు. మరుసటి ఏడాది 'నిన్నే పెళ్లాడతా' చిత్రంలో జంటగా నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఒక క్లాస్ మూవీ టాలీవుడ్ రికార్డులు క్రియేట్ చేయడం అప్పట్లో ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచింది. ఇందులో నాగ్ - టబు జోడీ యూత్ ఫేవరేట్ గా మారిపోయింది.
x-girlfriend is back #Nagarjuna #Tabu pic.twitter.com/2qRVMuFtAc
— ➻ ͣ ͫ🅱️² 🗯️ (@biasedbanti) October 9, 2025
వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయింది.'నిన్నే పెళ్లాడతా' హిట్టయ్యాక 1998లో 'ఆవిడా మా ఆవిడే'సినిమాలో నాగార్జున - టబు జంటగా కనువిందు చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. చిరంజీవి, బాలకృష్ణలతో టబు నటించారు కానీ.. నాగ్ తో మాత్రం స్క్రీన్ పంచుకోలేదు. అయినప్పటికీ వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగింది. గతంలో కొన్ని ఫంక్షన్స్ లో వీరు కలిసి కనిపించారు. అఖిల్ రిసెప్షన్ లో టబు సందడి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ 100 సినిమాలో టబు, నాగ్ కలిసి నటిస్తారని అంటున్నారు. అయితే ఇది హీరోయిన్ పాత్ర కాదని, కథలో కీలకమైన క్యారెక్టర్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన టబు.. ప్రస్తుతం విజయ్ సేతుపతి - పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున 100 మూవీలో భాగం కానున్నారని వార్తలు వస్తున్నాయి . మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.












Click it and Unblock the Notifications