విడాకులు తీసుకున్న హీరోయిన్..అతనితో ఎఫైర్ కారణామా..?
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది.
కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. జీవీ ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో మరో నటి విడాకులు తీసుకుని షాకిచ్చింది.

ప్రముఖ బుల్లితెర నటి శిరీష తాను విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. టెలివిజన్ రంగంలో శిరీషకు మంచి గుర్తింపు ఉంది. పలు సీరియల్స్లో హీరోయిన్గా నటించిదామె. ముఖ్యంగా మనుస్సు, మమత సీరియల్తో శిరీష ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. శిరీష ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తోంది. తాజాగా ఆమె తన భర్తకు విడాకులిచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. నేను నా భర్తతో విడిపోవడానికి కారణం, మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితులే, అందుకే మేము మా బంధాన్ని తెచ్చుకున్నాం.. మీరు కూడా మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను అంటూ తెలిపింది.
అయితే శిరీష విడాకులు తీసుకోవడానికి ఎఫైర్ కారణమని సోషల్ మీడియాలో రూమర్ వైరల్ అవుతోంది. శిరీష ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. అది ఇంట్లో తెలిసిపోయే సరికి భార్య భర్తల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. దీంతో విడాకులు తీసుకున్నారంటూ ఊహగానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications