'హీరో కృష్ణకు మినహాయింపు సరికాదు'

అయితే ఇందులో ఎపిఐఐసికి చెందిన భూమే 445 నుండి 455 ఎకరాల దాకా ఉందని, మిగిలిన 80-90 ఎకరాలను ప్రయివేటు వ్యక్తుల నుండి సేకరించాల్సి ఉందని, తర్వాత 80.35 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని, ఇందులో సినీ నటుడు కృష్ణ కుటుంబం, మరికొందరికి చెందిన 11.26 ఎకరాలు కూడా ఉందని, భూసేకరణ నుంచి మినహాయింపు కోరుతూ కృష్ణ, విజయనిర్మల అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేశర రెడ్డికి లేఖ రాశారని తెలిపిందని తెలుస్తోంది.
ఆ తర్వాత కృష్ణ కుటుంబానికి చెందిన భూమికి మినహాయింపు లభించిందని, అయితే భూసేకరణలో ఇతరులకు అనుసరించిన విధానాన్ని కృష్ణ కుటుంబానికి తదితరులకు అనుసరించక పోవడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాత్రను సిబిఐ తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టు కోసం ఎపిఐఐసి సేకరించిన భూమిలో 2.5 ఎకరాలను ఓ రాజకీయ నాయకుడు ఆక్రమించుకున్నారని తాజాగా కోర్టుకు తెలిపినట్లుగా సమాచారం. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
కాగా ఎమ్మార్ కేసులో మరో అదనపు చార్జిషీట్ను సిబిఐ శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య జరిగిన ఒప్పందంలో ఉల్లంఘనల వల్ల సర్కారుకు రూ.43 కోట్లు నష్టం వాటిల్లిందని తొలి చార్జిషీట్లో పేర్కొనగా, ఏప్రిల్ 23న దాఖలైన అదనపు చార్జిషీట్లో దాన్ని రూ.96 కోట్లుగా సవరించింది. తాజా చార్జిషీట్లో ఆ మొత్తాన్ని రూ.215కోట్లుగా నిర్ధారించింది. మూడో చార్జిషీట్లో కొత్తగా ఎవరినీ నిందితులుగా చూపకున్నా, ఇప్పటికే కేసులు నమోదైన 14మందిపైనే మరిన్ని ఐపిసి సెక్షన్ల కింద కేసులు జోడించినట్లు తెలుస్తోంది.
ఎమ్మార్ వ్యవహారంలో కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, సునీల్ రెడ్డి, శ్రీకాంత్ జోషి కలిసి కుట్రపన్ని ఎపిఐఐసికి నష్టం కలిగించారని, చదరపు గజాన్ని రూ.5 వేల నుంచి రూ.45 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారని సీబీఐ పునరుద్ఘాటించింది. దీనివల్ల ఏపీఐఐసీకి రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ మొత్తం కోనేరు ప్రసాద్, సునీల్రెడ్డి, ఎమ్మార్ ఎంజీఎఫ్ ఖాతాలకు చేరిందని పేర్కొంది. ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి సునీల్ రెడ్డి రూ.63.66 కోట్లు వసూలు చేశారని తెలిపింది.
ఇవి ఆయన సృష్టించిన పది డమ్మీ కంపెనీల ఖాతాలకు చేరాయని వెల్లడించింది. ఇక రూ.32.34 కోట్లు కోనేరు ప్రసాద్ కుమారుడి ఖాతాలోకి వెళ్లాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలం కూడా చార్జిషీట్కు జత చేసింది. శ్రవణ్ గుప్తా పర్యవేక్షణలో మొత్తం 37 ప్లాట్లు విక్రయంకాగా, అందులో 18 ప్లాట్లను 5 వేలకు గజం చొప్పున ఉద్యోగుల పేరుతో ఆయనే తీసుకున్నట్లు, మిగతా వాటిని అధిక ధరలకు విక్రయించినట్లు ఇది వరకే తేల్చిన సిబిఐ ఆ మొత్తం ఎంతో తాజాగా తేల్చినట్లు తెలుస్తోంది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications