కెసిఆర్ మొండిఘటం

విజయవాడ సభకు వెళ్లాలనే కెసిఆర్ నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు ఆహ్వానం పలికారు. విజయవాడకు కెసిఆర్ ను సాదరంగా ఆహ్వానిస్తామని వారు చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణ నుంచి ఆయన నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైంది. కెసిఆర్ విజయవాడకు వెళ్లొద్దంటూ తెలంగాణలోని సంస్థలు కొన్ని ప్రకటనలు చేశాయి. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహం బెడిసి కొట్టిందని, ఆయన విజయవాడ పర్యటనను రద్దు చేసుకుంటారని ప్రచారం జోరందుకుంది.
నిజానికి, కెసిఆర్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని లాభనష్టాల గురించి గానీ పరిణామాల గురించి గానీ ఆలోచించరు. ముందుకే సాగుతారు. విజయవాడకు వెళ్లాలనే తన నిర్ణయంలో మార్పు లేదని కెసిఆర్ తాజాగా ప్రకటించడాన్నిబట్టి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. కత్తి పద్మారావు మరోసారి సోమవారం కెసిఆర్ ను కలిశారు. ఈ భేటీ తర్వాత కత్తి పద్మారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కెసిఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ నెల 29వ తేదీన జరగాల్సిన జై ఆంధ్ర మహాసభ తుఫాను కారణంగా వాయిదా పడిందని, సభ రద్దు కాలేదని ఆయన చెప్పారు. ఈ సభకు కెసిఆర్ తప్పకుండా వస్తారని ఆయన చెప్పారు. కెసిఆర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను విజయవాడ సభకు వెళ్లి తీరుతానని చెప్పారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications