జగన్ ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చేనా?

తనకు మద్దతిచ్చిన అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని టిడిపి, కాంగ్రెసులకు గట్టి షాక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. ఎన్నికలు ఫిబ్రవరిలో అంటే మరెంతో సమయం లేనందున గుంటూరులో యాత్ర పూర్తి కాగానే ఉధృతంగా ప్రచారం చేపట్టాలని ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్యాడర్ కూడా జగన్ను కోరుతున్నాయట. గెలుపు మనదే అని అయితే కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల వలె భారీ మెజార్టీతో గెలిచి టిడిపి, కాంగ్రెసులకు చెక్ చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ ఇప్పటి నుండే ప్రచారం సాగిస్తే అది ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
జగన్ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఆయన తన ఓదార్పు యాత్రలోనే తన ఎమ్మెల్యేలను ఆశీర్వదించాలని చెబుతూ ప్రచార పర్వానికి తెరలేపారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు గుంటూరులో ఓదార్పు యాత్ర చేపట్టి ఆ తర్వాత బ్రేక్ ఇచ్చి నేరుగా ప్రచార బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications