మ్యాచ్ ఫిక్సింగ్: జగన్పై టిడిపి రివర్స్ అటాక్

ఇక భూకేటాయింపులపై ఇటీవల వేసిన సభా సంఘం పైనా టిడిపి విరుచుకు పడింది. సభా సంఘంలో తమ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల నిష్పత్తిని బట్టి సభ్యులను నియమించలేదని, వారిని కూడా తమను సంప్రదించకుండానే నియమించడం పట్ల టిడిపి మండిపడుతోంది. భూకేటాయింపుల అంశంలో వైయస్ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని రక్షించేందుకే కిరణ్ ఇలా నియామకం చేశారని అంటున్నారు. అంతేకాదు సొంత పార్టీలోని కొందరు నేతలు కూడా సిఎం కిరణ్ జగన్ అవినీతి పైన, పార్టీ అధినేత్రిని విమర్శిస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని తీసుకొని కిరణ్తో కుమ్మక్కైంది టిడిపి కాదని జగనే అని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కేవలం టిడిపి అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications