వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరుకునపడ్డ బాబు: యాత్రతో హరికృష్ణ క్యాష్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nandamuri Harikrishna - Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన సీమాంధ్రలో యాత్ర చేపడతారని వార్తలు వచ్చాయి. అయితే, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర చేయనున్న నేపథ్యంలో నాయకుల బుజ్జగింపుతో ఆయన అప్పుడు వెనక్కి తగ్గారట.

అయితే, ఇప్పుడు బాబు యాత్ర చేపట్టక పోవడంతో పాటు, పార్టీ నాయకులకు ఇష్టంలేకపోయినా ఆయన మనసుమార్చుకున్నారని అంటున్నారు. ఆయన యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. టిడిపి వ్యవస్థాపకులు, తన తండ్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి ఈ యాత్ర మొదలు పెట్టేందుకు హరికృష్ణ సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడకు వచ్చిన తరువాత నిర్దిష్టంగా ఏ తేదీన ఈ యాత్రను మొదలు పెట్టాలి? ఎటు వైపు యాత్ర నిర్వహించాలి? అన్నది ఖరారవుతుందట. హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత మిగిలిన ఎంపీలు ఆయనతో మాట్లాడి ప్రస్తుతానికి యాత్రలు పెట్టుకోవద్దని సూచించారట. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు యాత్ర లేకపోయినప్పటికీ, హరికృష్ణ యాత్ర చర్చనీయాంశమైంది.

మరోవైపు హరికృష్ణ తన అన్న టిడిపిని పునరుద్ధరించే అవకాశాలున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారసత్వ పోరు నేపథ్యంలో చంద్రబాబును ఢీకొట్టేందుకే హరి సిద్ధమైనట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఇరుకున పడ్డారు. దీనిని సమైక్యాంధ్ర నినాదంతో హరికృష్ణ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.

English summary

 Telugudesam Party senior leader Nandamuri Harikrishna may begin his Bus Yatra for Samaikyandhra from Nimmakuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X