టీవీ చానెల్పై లగడపాటి మనుషుల దాడి
సివిఆర్ చానెల్ కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. ఓ కారుపై కూడా దాడి చేశారు. ఆపడానికి ప్రయత్నించిన చానెల్ ఉద్యోగులను తోసేసి వీరంగం సృష్టించారు. టీవీ ఉద్యోగులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను ఈవెంట్ మేనేజర్ అజయ్, ప్రైవేట్ కాంట్రాక్టర్ రవి కిరణ్లుగా గుర్తించారు. రవి బెంగళూర్లోని లాంకోలో కాంట్రాక్టర్గా పనిచేశాడు. సివిఆర్ చానెల్లో ల్యాంకోకు వ్యతిరేకంగా వార్తాకథనం రావడంతో ఆగ్రహం చెంది దాడి చేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
వారిద్దరిపై కేసు నమోదు చేసి, కస్టడీకి పంపించారు. సివిఆర్ చానెల్ ఇటీవలి కాలంలోనే ప్రారంభమైంది. నిందితులు కార్యాలయంపైకి రాళ్లు రువ్వారని కూడా తెలుస్తోంది. అయితే, ఈ సంఘటనతో లగడపాటి రాజగోపాల్కు ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చునని అంటున్నారు.