వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ చానెల్‌పై లగడపాటి మనుషుల దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

News channel office attacked
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మనుషులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లోని ఓ టీవీ చానెల్ కార్యాలయంపై దాడి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల సివిఆర్ చానెల్‌పై వారు మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో దాడి చేశారు.

సివిఆర్ చానెల్ కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. ఓ కారుపై కూడా దాడి చేశారు. ఆపడానికి ప్రయత్నించిన చానెల్ ఉద్యోగులను తోసేసి వీరంగం సృష్టించారు. టీవీ ఉద్యోగులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను ఈవెంట్ మేనేజర్ అజయ్, ప్రైవేట్ కాంట్రాక్టర్ రవి కిరణ్‌లుగా గుర్తించారు. రవి బెంగళూర్‌లోని లాంకోలో కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. సివిఆర్ చానెల్‌లో ల్యాంకోకు వ్యతిరేకంగా వార్తాకథనం రావడంతో ఆగ్రహం చెంది దాడి చేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.

వారిద్దరిపై కేసు నమోదు చేసి, కస్టడీకి పంపించారు. సివిఆర్ చానెల్ ఇటీవలి కాలంలోనే ప్రారంభమైంది. నిందితులు కార్యాలయంపైకి రాళ్లు రువ్వారని కూడా తెలుస్తోంది. అయితే, ఈ సంఘటనతో లగడపాటి రాజగోపాల్‌కు ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చునని అంటున్నారు.

English summary

 Supporters of Congress MP Lagadapati Rajagopal attacked a news channel's office in Jubilee Hills late on Tuesday night and damaged its glass panes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X