సాక్షి నుంచి సజ్జల ఔట్: జగన్ కార్యదర్శిగా...

పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవడంలో భాగంగా వైయస్ జగన్ పార్టీ కమిటీలను పునర్వ్యస్థీకరించారు. పార్టీ కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి సాక్షి మీడియా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఆయన వైవీ సుబ్బారెడ్డితో పాటు వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా తనకు అనుబంధంగా వైయస్ జగన్ ఇద్దరు కార్యదర్శులను నియమించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యదర్సి పదవులను నిర్వహిస్తారు. సజ్జల రామకృష్ణా రెడ్డి స్థానంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తి బాధ్యతలు స్వీకరించారు.
సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండింటికీ అధ్యక్షుడి కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి, విడివిడిగా కమిటీలో నాయకులను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications