ఈ - మెయిల్ పాస్వర్డ్ మర్చిపోయిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల తన ఈ మెయిల్ పాస్ వర్డ్ను మర్చిపోయారు. దీంతో, అతను కొత్త పాస్ వర్డ్ పొందారు.
దాదాపు ఏడాది కాలంగా కెసిఆర్ తన అఫీషియల్ ఈ మెయిల్ ఐడీని ఉపయోగించడం లేదు. దీంతో, అతను తన పాస్ వర్డ్ను మర్చిపోయారు.
ఇటీవల కేంద్రం నుంచి కెసిఆర్కు ముఖ్యమైన మెయిల్ వచ్చింది. కెసిఆర్ సమాధానం కోసం కేంద్ర అధికారులు నిరీక్షించారు. అయితే, కేంద్రం తనకు మెయిల్ పంపించిందన్న విషయం తెలిసి కెసిఆర్ తన మెయిల్ తెరవబోయారు.
కానీ అది విఫలైంది. తన పాస్ వర్డ్ మర్చిపోయారు. ఈ విషయం వెంటనే ఐటీ డిపార్టుమెంటుకు తెలిసింది. వారు రంగంలోకి వెంటనే దిగారు. కొత్త పాస్ వర్డ్తో కెసిఆర్ తన మెయిల్ ఓపెన్ చేశారు.
సమాచారం మేరకు... [email protected] ఈ-మెయిల్ ఐడి.. కెసిఆర్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత... అంటే 2014 జూన్ నెలలో తెరిచారు. ఈ ఖాతాను చాలా రోజులుగా తెరవకపోవడంతో పాస్ వర్డ్ మర్చిపోయారు.