ఇదే దుస్థితి!: కుర్చీ విరిగి కిందపడ్డ ఆంధ్రా ఎంపీ, సారీ
విశాఖపట్నం: కుర్చీ విరిగి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు కిందపడిన సంఘటన గురువారం నాడు జరిగింది. ఆయనకు ఈ చేదు అనుభవం వన్ టౌన్లోని ఘోషా ఆస్పత్రిలో ఎదురైంది.
ఆసుపత్రిలో సమస్యలు తెలుసుకునేందుకు ఎంపీ హరిబాబు గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో అధికారులు ఆయనకు పొరపాటున విరిగిపోయిన కుర్చీ వేయడంతో అందులో కూర్చున్న హరిబాబు కింద పడిపోయారు.

అయితే, అది విరిగినట్లుగా గుర్తించలేకపోయారు. దానిలో కూర్చున్న ఎంపీ కాస్త వెనక్కి వాలారు. దీంతో అది విరిగి, ఆయన నేల మీద పడిపోయారు. ఆసుపత్రి సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కుర్చీ దుస్థితిలోనే ఆసుపత్రి ఉందని వ్యాఖ్యానించారు.
కాగా, వెంటనే అధికారులు పొరపాటును గుర్తించి ఎంపీ హరిబాబును క్షమాపణ కోరారు. అనంతరం ఆస్పత్రిలోని గర్భిణిలు, బాలింతలు, శిశువుల వార్డును సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కావాలసిన ఆధునిక పరికరాల కొనుగోలుకు ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయించనున్నట్లు హరిబాబు ప్రకటించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications